వన్యప్రాణులతో ముప్పా..!
మానవ మనుగడకు ప్రకృతిలో జీవ వైవిధ్యం ఎంతో అవసరం. మానవుడు నాగరికత పేరుతో అవసరాల కోసం అడవులను నాశనం చేస్తున్నారు. దీంతో వాటిలో నివసిస్తున్న వన్యప్రాణులు అంతరిస్తున్నాయి. వాటిని సంరక్షించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు చేస్తోంది.
పరిహారం పొందే అవకాశం
పెద్దదోర్నాల, న్యూస్టుడే
మానవ మనుగడకు ప్రకృతిలో జీవ వైవిధ్యం ఎంతో అవసరం. మానవుడు నాగరికత పేరుతో అవసరాల కోసం అడవులను నాశనం చేస్తున్నారు. దీంతో వాటిలో నివసిస్తున్న వన్యప్రాణులు అంతరిస్తున్నాయి. వాటిని సంరక్షించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు చేస్తోంది. వాటికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటుంది. అలాగే వాటి ద్వారా ప్రజల ఆస్తులకు, పశువులకు నష్టం కలిగితే పరిహారం అందజేస్తోంది. మూడు నెలల క్రితం దోర్నాల రేంజ్ లోని పెద్దబొమ్మలాపురం బీటు సట్టుతండా సమీపంలోని మిరప పంటను అడవి పందులు నాశనం చేశాయి. గత నెలలో అదే బీటులో పెద్దపులి ఆవును చంపింది. వారం క్రితం గంజివారిపల్లె రేంజ్లో పాలుట్ల సమీపంలో పెద్దపులి మనిషి పై దాడి చేసి గాయపరచింది. పెద్దపులి, చిరుతల దాడిలో చనిపోయిన పశువులకు, మనుషులకు, ఎలుగుబంటి దాడిలో గాయపడిన వారికి, అడవి పందులు, దుప్పులతో పాటు ఇతర వన్యప్రాణుల కారణంగా పంటలకు నష్టం కలిగితే తీసుకోవాల్సి జాగ్రత్తలపై కథనం.
అర్హతలు ఇవీ....
పెద్దపులులు, చిరుతలు దాడి చేసి చంపిన పశువుల సమాచారాన్ని బాధితుడు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. పెద్దపులులు, చిరుతల అడుగులను పరిశీలిస్తారు. మిగిలిన కళేబరాన్ని అక్కడే ఉంచుతారు. ఆ ప్రాంతాల్లో కెమెరా ట్రాప్లు బిగిస్తారు. ఆ కళేబరాన్ని చంపిన వన్యప్రాణి మళ్లీ వచ్చి తింటుంది. ఆ సమయంలో కెమెరాలో వాటి ఫొటోలు చిత్రీకరిస్తారు. పశువైద్యాధికారి మిగిలిన కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు. ః ఆ బీట్ పరిధిలోని గూడేలకు చెందిన పశువులకు మాత్రమే పరిహారం అందిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరణించిన వాటికి పరిహారం ఇవ్వరు.
* పరిహారం అందించేందుకు కేంద్రప్రభుత్వం 2011లో జీవో 90 విడుదల చేసింది. 2014లో దానిని సవరించి 57 జీవో విడుదల చేసింది. దాని ప్రకారం జంతువులు చనిపోతే మార్కెటులో దానికి ఉండే ధరను చెల్లిస్తారు. మనిషి చనిపోతే రూ.5 లక్షలు, తీవ్ర గాయాలైతే రూ.75వేలతో పాటు చికిత్సకు అయ్యే ఖర్చు చెల్లిస్తారు. పంట నష్టానికి హెక్టారుకు రూ.ఆరు వేలు, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.75వేలు అందజేస్తారు.
ఎనిమిదేళ్లలో రూ.22 లక్షలు..
బాధితులకు పరిహారం అందజేస్తున్న దోర్నాల అటవీ క్షేత్ర అధికారి విశ్వేశ్వరరావు
మార్కాపురం డివిజన్లో దోర్నాల, గంజివారిపల్లె, యర్రగొండపాలెం, వీపీసౌత్ రేంజ్లో నల్లమల విస్తరించి ఉంది. దానిలో అధికభాగం దోర్నాల, గంజివారిపల్లె రేంజ్లో మేత కోసం వెళ్లిన ఆవులు, గేదెలు, ఎద్దులపై పెద్దపులులు, చిరుతలు దాడి చేసి చంపి తింటున్నాయి. దోర్నాల రేంజ్ పరిధిలో ఎనిమిదేళ్లలో 122 కేసులు నమోదయ్యాయి. వాటికి పరిహారంగా బాధితులకు రూ.22,04,900 పరిహారం అందజేశారు.
నష్టం వాటిల్లితేనే..
వన్యప్రాణులతో ప్రజలకు, పశువులకు, పంటలకు నష్టం జరిగితే పరిహారం అందజేస్తున్నాం. పెద్దపులి, చిరుతలు వాటి ఆవాసాల్లోకి గేదెలు, ఆవులు, ఎద్దులు వెళ్లడంతో చంపి తింటున్నాయి. పశుపోషకులు వాటిని ఆ ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో తొలిసారిగా పెద్దపులి మనిషి పై దాడి చేసింది. అది పిల్లలతో ఉండటమో, తనకు హాని తలపడతాడనే భావనతో దాడి చేసి ఉంటుంది. వన్యప్రాణులతో ఆస్తి, పశు నష్టం జరిగితే తక్షణమే స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. ఆ ప్రాంతాన్ని పరిశీలించి పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. నిధులు మంజూరైన వెంటనే చెక్కుల రూపంలో అందిస్తాం.
- విశ్వేశ్వరరావు, దోర్నాల అటవీ క్షేత్రాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి