logo

సెప్టెంబర్‌లో రైతు సంఘం జిల్లా మహాసభలు

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా మహాసభలు సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లో చీమకుర్తిలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. చీమకుర్తిలో జిల్లా రైతు సంఘం కమిటీ సమావేశం గాలి వెంకట రామిరెడ్డి అధ్యక్షతన శనివారం ఏర్పాటైంది.

Updated : 14 Aug 2022 06:49 IST


ప్రచార గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న రైతు సంఘం నాయకులు

చీమకుర్తి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా మహాసభలు సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లో చీమకుర్తిలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. చీమకుర్తిలో జిల్లా రైతు సంఘం కమిటీ సమావేశం గాలి వెంకట రామిరెడ్డి అధ్యక్షతన శనివారం ఏర్పాటైంది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడారు. గత రెండు నెలలుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. మహాసభల విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రచార గోడపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు పెంట్యాల హనుమంతరావు, పిల్లి తిప్పారెడ్డి, రత్నారెడ్డి, షేక్‌మాబు, కె.చిన్నపరెడ్డి, బెజవాడ శ్రీనివాసరావు, కొల్లూరి వెంకటేశ్వర్లు, నల్లూరి క్రిష్ణయ్య, కృష్ణమాచారి, సుబ్బారెడ్డి, పాపిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని