logo

జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులు

ఈ నెల 19, 20, 21 తేదిల్లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అభినందించారు.

Published : 14 Aug 2022 02:41 IST


క్రీడాకారులను అభినందిస్తున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ నెల 19, 20, 21 తేదిల్లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అభినందించారు. ఈ నెల 6, 7 తేదిల్లో కర్నూలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి అండర్‌-13, అండర్‌-15 బాల, బాలికల విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు వారిని శనివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎంపీ అభినందించారు. కార్యక్రమంలో రెజ్లింగ్‌ శిక్షకురాలు కోటేశ్వరి, హరిప్రియ, పీడీలు జ్యోష్నాదేవి, అశోక్‌బాబు, రెజ్లింగ్‌ అసోసియేషన్‌ జిల్లా సంఘం అధ్యక్షురాలు హజీరా బేగం, కార్యదర్శి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని