జగనన్న కాలనీని వదల్లేదు
గిద్దలూరులోని జగనన్న కాలనీలో ప్రజావసరాల కోసం వదిలిన స్థలాన్ని ఆక్రమించి ఓ స్థిరాస్తి వ్యాపారి తన లేఅవుట్కు అనుగుణంగా రహదారి నిర్మించేశారు. ఇంతవరకు అధికారులు అటు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పట్టణంలోని ఒంగోలు-నంద్యాల రహదారిలో గల ఉద్యానశాఖ స్థలంలో జగన్నకాలనీ ఏర్పాటు చేసి 320 ప్లాట్లను
ఆక్రమించి రోడ్డు నిర్మాణం
ఓ స్థిరాస్తి వ్యాపారి నిర్వాకం
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే:
జగనన్న కాలనీలో ఖాళీగా వదిలిన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన రహదారి
గిద్దలూరులోని జగనన్న కాలనీలో ప్రజావసరాల కోసం వదిలిన స్థలాన్ని ఆక్రమించి ఓ స్థిరాస్తి వ్యాపారి తన లేఅవుట్కు అనుగుణంగా రహదారి నిర్మించేశారు. ఇంతవరకు అధికారులు అటు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పట్టణంలోని ఒంగోలు-నంద్యాల రహదారిలో గల ఉద్యానశాఖ స్థలంలో జగన్నకాలనీ ఏర్పాటు చేసి 320 ప్లాట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు 29 సెంట్ల ఖాళీ స్థలాన్ని అధికారులు వదిలారు. దీంతో ఓ స్థిరాస్తి వ్యాపారి కన్నుపడింది. సమీపంలో తాను వేసిన లేఅవుట్కు రోడ్డు కోసం కాలనీలోని 7వ లైనులో ఖాళీ స్థలాన్ని ఆక్రమించారు. గ్రావైల్ తోలి రహదారి నిర్మాణం చేపట్టారు.
చూసీచూడనట్లు..
స్థిరాస్తి వ్యాపారి జగనన్న కాలనీ వెనుక వైపు అక్రమ లేఅవుట్ వేస్తున్న సమయంలో పలువురు కౌన్సిలర్లు నగర పంచాయతీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కాలనీకి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేఅవుట్లోకి కాలనీ ప్రధాన రహదారి నుంచి వెళ్లకుండగా చివరన యంత్రంతో గుంతలు తీశారు. ఇటీవల ఆ వ్యాపారి ఆ గుంతలను పూడ్చివేయడమే గాక తాజాగా ప్రజావసరాలకు వదిలిన ఖాళీ స్థలాన్ని కలిపి రోడ్డు వేసేశారు. కమిషనర్ రామకృష్ణయ్య దృష్టికి తీసుకువెళ్లగా నగర పంచాయతీ స్థలంలో రహదారి నిర్మాణం చేపట్టినట్లయితే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీ చుట్టూ ప్రహరీ నిర్మిస్తామన్నారు. అనుమతి లేకుండా లేఅవుట్ వేస్తున్న వ్యాపారికి నోటీసులు జారీచేస్తామన్నారు.
బేరం పెట్టి ప్లాట్ల విక్రయం
జగనన్న కాలనీలో నివేశన స్థలాలు పొందిన కొందరు లబ్ధిదారులు వాటికి బేరం పెట్టారు. కేటాయించిన ప్లాట్లను రూ.4.50 లక్షల వంతున విక్రయిస్తుండటం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’