logo

తెదేపా కార్యకర్తలపై దాడి

నీటి ట్యాంకు వద్ద నెలకొన్న వివాదం నేపథ్యంలో తెదేపా కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు సామూహికంగా దాడి చేశారు. కళ్లలో కారం కొట్టి కర్రలతో దాడిచేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మండల కేంద్రం పెద్దారవీడులో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి

Published : 27 Sep 2022 02:08 IST

కళ్లలో కారం కొట్టి..

వైద్యశాలలో చికిత్స పొందుతున్న శ్రీను

పెద్దారవీడు, న్యూస్‌టుడే: నీటి ట్యాంకు వద్ద నెలకొన్న వివాదం నేపథ్యంలో తెదేపా కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు సామూహికంగా దాడి చేశారు. కళ్లలో కారం కొట్టి కర్రలతో దాడిచేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మండల కేంద్రం పెద్దారవీడులో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాజులపల్లి శ్రీను, సుబ్బారావు అన్నదమ్ములు. సొంతంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. రోజూ ఇంటి ముందు ఉండే పంచాయతీ కొళాయి నుంచి నీటిని పట్టుకుంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి ఆ నీటిని పట్టుకోనీయకుండా వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన దాదాపు 20 మంది వ్యక్తులు తెదేపా సానుభూతిపరులైన శ్రీను, సుబ్బారావుల కళ్లలో కారం కొట్టి కర్రలతో దాడి చేశారు. శ్రీను చేయి విరగగా, సుబ్బారావు వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు అక్కడకు చేరుకొని బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని