logo

దాడులకు పాల్పడితే సహించేది లేదు

మండల కేంద్రం పెద్దారవీడులో సోమవారం రాత్రి వైకాపా కార్యకర్తలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి మార్కాపురం జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న తెదేపా నాయకులు గాజులపల్లి శ్రీను, సుబ్బారావును... తెదేపా

Published : 28 Sep 2022 02:25 IST

చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడుతున్న తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఎరిక్షన్‌బాబు, నాయకులు

పెద్దారవీడు, న్యూస్‌టుడే: మండల కేంద్రం పెద్దారవీడులో సోమవారం రాత్రి వైకాపా కార్యకర్తలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి మార్కాపురం జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న తెదేపా నాయకులు గాజులపల్లి శ్రీను, సుబ్బారావును... తెదేపా యర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు మంగళవారం పరామర్శించారు. సంఘటన వివరాలు, దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ... ఇటీవల కాలంలో తెదేపా సానుభూతిపరులపై వైకాపా వారి దాడులు పెరిగాయన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన కుటుంబాల్లో... అధికార పార్టీ నాయకులు రాజకీయాలను రెచ్చగొట్టి ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని వారు గ్రహించాలన్నారు. తెదేపా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం యర్రగొండపాలెంలో సీఐ మారుతీ కృష్ణను కలిసి దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, షేక్‌ మాబు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని