Chinta Mohan: జగనన్న ఉత్సవాలా.. శ్రీవారి బ్రహ్మోత్సవాలా?: చింతా మోహన్
తిరుమలలో వేంకటేశ్వరస్వామి చిత్రమే కనిపించకుండా వేల సంఖ్యలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలతో నింపేశారని, అక్కడ జరుగుతున్నవి శ్రీవారి
కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ విమర్శ
మాట్లాడుతున్న చింతా మోహన్.. చిత్రంలో కాంగ్రెస్ నాయకులు
ఈనాడు డిజిటల్, ఒంగోలు: తిరుమలలో వేంకటేశ్వరస్వామి చిత్రమే కనిపించకుండా వేల సంఖ్యలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలతో నింపేశారని, అక్కడ జరుగుతున్నవి శ్రీవారి బ్రహ్మోత్సవాలా..జగనన్న ఉత్సవాలా? అనేది తెలియని దుస్థితి నెలకొందని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ విమర్శించారు. బుధవారం ఒంగోలు ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. ఒకవైపు రోజుకు రూ.100 సంపాదించలేనివారు ఉంటే, అదే రోజుకు రూ.వెయ్యి కోట్లు సంపాదించే అదానీ వంటివారు ఉన్నారన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ఎన్డీయే ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనలో కేవలం ఎనిమిది చిరుత పులులను సాధించిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మందిలో కోటి మంది కూడా సంతృప్తికరంగా భోజనం చేయలేని పరిస్థితి ఉందన్నారు. మూడున్నరేళ్ల వైకాపా పాలనలో విద్యాప్రమాణాలు పడిపోయాయని విమర్శించారు. జగనన్న కానుకల పేరుతో ఉపాధ్యాయులను తల్లిదండ్రుల వద్దకు పంపి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని.. పాఠశాలల్లో బోధన జరగక విద్య పూర్తిగా కుంటుపడిందన్నారు.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు లేక నర్సులే వైద్యం చేస్తున్నారని.. సూది, దూది, మందులు లేవన్నారు. అనేక ప్రాజెక్టులు నిర్వీర్యం అయిపోయాయని.. ఒక్కటి కూడా నూతనంగా ప్రారంభించలేదన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని ఖండించారు. రాజధాని, విశాఖ ఉక్కు, పోలవరం వంటి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే శక్తి జగన్మోహన్రెడ్డికి లేదన్నారు. ్ర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ అక్టోబరు 20, 21, 22, 23 తేదీల్లో కర్నూలు జిల్లాలో ఉంటుందన్నారు. ప్రజాహితవాదులందరినీ సంఘటితం చేసి యాత్రకు ఆహ్వానిస్తామన్నారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి