విచారణకూ వాయిదాలెందుకు!
దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ నరసింహ స్వామి దేవాలయంలో నిధుల గోల్మాల్పై విచారణ చేయడంలోనూ అధికారులు తాత్సారం చూపుతున్నారు. గత మంగళవారం(సెప్టెంబర్
నరసింహ స్వామి ఆలయ నిధులు కాజేసిన అధికారి
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే: దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ నరసింహ స్వామి దేవాలయంలో నిధుల గోల్మాల్పై విచారణ చేయడంలోనూ అధికారులు తాత్సారం చూపుతున్నారు. గత మంగళవారం(సెప్టెంబర్ 27) జరగాల్సిన విచారణకు నోటీసులు అందుకున్న 27 మందికి కేవలం ఆరుగురే హాజరవ్వడం, విచారణ చేయాల్సిన అధికారే గైర్హాజరవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఏం జరిగిందంటే...: నరసింహ స్వామి దేవాలయంలో గత జూన్ నెల 9 నుండి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అప్పుడు ఇక్కడ పనిచేసిన కార్యనిర్వహణాధికారి పరిమితికి మించి నిధులు ఖర్చు చేసి దస్త్రాల్లో నమోదు చేయకుండా సుమారు రూ.15 లక్షలు పైగా స్వాహా చేసినట్లు గత నెల 27వ తేదీన జరిగిన విచారణలో అధికారులు తేల్చారు. ఉత్సవాలకు రూ.7 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా, ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోకుండా అధికమొత్తంలో ఖర్చు పెట్టినట్లు బయటపడింది. సదరు ఈవోతోపాటు బ్రహ్మోత్సవాల్లో పనులు చేసినట్లు చెక్కులు తీసుకున్న 27 మంది, ఆలయ సిబ్బందికి ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే మంగళవారం వారిలో ఆరుగురు మాత్రమే వచ్చారు. ఒంగోలు నుంచి వచ్చి విచారణ చేయాల్సిన అధికారి కూడా రాకపోవడంతో వచ్చిన వారు వెనుదిరిగారు. స్వామి వారి నిధులు కాజేసినప్పుడు నిర్లిప్తంగా ఉండి, విచారణలోనూ అధికారులు తాత్సారం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముడుపులు అందాయని ఆరోపణలు...: నిధుల గోల్మాల్పై కొంతమంది అధికారులకు ముడుపులు అందాయని, అందుకే జమా ఖర్చుల విచారణకు అధికారులు ముఖం చాటేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆలయ సిబ్బందికి దేవాదాయ శాఖ నుంచి సుమారు రూ.10 లక్షలు వరకు వేతన బకాయిలు రావాల్సి ఉన్నాయి. నేటికీ స్వామి వారికి నైవేద్యం సమర్పించేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. అన్నదానం కోసం దాతలు అందజేస్తున్న విరాళాలు సైతం కొందరి సొంత ఖాతాలకు వెళుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒంగోలు నుంచి నిధుల గోల్మాల్ విచారణకు రావాల్సిన అధికారి వివరణ కోరేందుకు ‘న్యూస్టుడే’ చరవాణి ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?