పండగ వేళ పప్పు, పంచదార లేదు!
గత నెల వినాయక చవితి, వచ్చే నెలలో దసరా, దీపావళి... ఇలా వరుస పండగల వేళ పౌరసరఫరాల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన కందిపప్పు, పంచదార సరఫరా నిలిచిపోయింది. బయట
గత నెల ఇవ్వలేదు... వచ్చే నెల రేషన్లోనూ అనుమానమే
ఒంగోలు గిడ్డంగి నుంచి రేషన్ దుకాణాలకు తరలించేందుకు ట్రాక్టర్కు బియ్యం ఎత్తుతున్న హమాలీలు
గత నెల వినాయక చవితి, వచ్చే నెలలో దసరా, దీపావళి... ఇలా వరుస పండగల వేళ పౌరసరఫరాల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన కందిపప్పు, పంచదార సరఫరా నిలిచిపోయింది. బయట మార్కెట్లో వాటి ధరలు మండుతుండడంతో... పేదలకు పండగ సంతోషం దూరమవుతోంది. గత ఎనిమిది నెలలుగా వీటి సరఫరా సక్రమంగా లేకపోవడం గమనార్హం. ఇప్పటికే సరకులపై ఇచ్చే రాయితీ తగ్గించారు. ప్రస్తుతం పూర్తిగా సరకులే ఇవ్వకుండా కోత పెడుతుండడంపై కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీలోనూ చాలా కుటుంబాలకు కోత విధించారు.
న్యూస్టుడే - ఒంగోలు గ్రామీణం
జిల్లాల పునర్విభజన తరువాత ప్రకాశం జిల్లాలో 6,55,525 బియ్యం కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలకు ప్రతి నెలా అర కిలో చక్కెర, కిలో కందిపప్పుతో పాటు... మనిషికి అయిదు కిలోల చొప్పున బియ్యాన్ని రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పౌర సరఫరాల శాఖ అధికారుల అంచనా ప్రకారం ప్రతి నెలా కార్డుదారులకు సరఫరా చేసేందుకు 655 టన్నుల కందిపప్పు, 344 టన్నుల పంచదార అవసరం. గత నెలలో ఈ సరకులు ఇవ్వలేదు. వచ్చే నెలకు సంబంధించి పంపిణీ సమయం సమీపిస్తున్నా... నేటికీ ఆయా సరకులు జిల్లాకు చేరలేదు. వీటి పంపిణీపై పౌరసరఫరాల శాఖ అధికారులకే సరైన సమాచారం లేకపోవడం గమనార్హం. ఇప్పటికే ఆయా గోదాముల నుంచి జిల్లాలోని సగం చౌక దుకాణాలకు బియ్యం సరఫరా పూర్తయింది. దీంతో దసరా వేళ బియ్యంతోనే సరిపెడతారన్న ప్రచారం జరుగుతోంది.
ఎనిమిది నెలలుగా ఇదే తీరు...
గత ఎనిమిది నెలలుగా కందిపప్పు, పంచదార పంపిణీ అరకొరగానే ఉంటోంది. వీటిలో ఏదో ఒకటే ఇస్తున్నారని... అది కూడా అందరికీ ఇవ్వడం లేదని కార్డుదారులు చెబతున్నారు. ప్రస్తుత పండగల సమయంలో ఆ కొద్దిపాటి భాగ్యమూ కరవైంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కందిపప్పు కిలో రూ.115 నుంచి రూ.120 వరకు ధర పలుకుతోంది. చౌక దుకాణాల ద్వారా కిలో రూ.67కే ఇచ్చేవారు. అరకిలో పంచదార రూ.17కు వచ్చేది. మామూలు సమయాల్లో పరిస్థితి ఎలా ఉన్నా... పండగ వేళ ఇవి అందకపోవడంతో తప్పనిసరిగా బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని పేదలు వాపోతున్నారు. గత ఏడాది కూడా నవంబరు నెలలో పంచదార పూర్తిగా ఇవ్వలేదు. అక్టోబర్, డిసెంబర్ నెలల్లో సగం మందికే పంపిణీ చేశారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్యామ్కుమార్ను సంప్రదించగా... గత నెలలో కందిపప్పు, పంచదార రాకపోవడంతో ఇవ్వలేకపోయామన్నారు. ఈ నెలలోనూ పైనుంచే సరకులు రాలేదని... రాగానే దుకాణాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
* బయటి మార్కెట్లో కందిపప్పు ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. వాటి సరఫరా నిమిత్తం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనే మూడు నెలలకోసారి టెండర్లు పిలుస్తున్నట్లు సమాచారం. నిధుల కొరత కారణంగా గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులో జాప్యం చోటుచేసుకోవడంతో... వారు ముఖం చాటేస్తున్నట్లు ఆ శాఖలోనే ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే సరకులు రావడం లేదని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
[ 20-04-2024]
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు. -
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
[ 20-04-2024]
ఎన్నికల కోడ్కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది. -
కిరాయికి కేటుగాళ్లు
[ 20-04-2024]
ఒకప్పుడు జిల్లాలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు వాళ్లు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు. ఇటువంటి వారితో అధికార పార్టీ కొత్త కుట్రలకు తెర లేపింది. -
అడవిలో ఇళ్లిచ్చిన అన్న
[ 20-04-2024]
నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు. -
రాజుకున్న ఎన్నికల వేడి
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. -
రగడ.. ఇదేం మర్యాద
[ 20-04-2024]
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. -
వైభవం.. రాములోరి రథోత్సవం
[ 20-04-2024]
శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. -
ఒట్టు పెడుతున్నాం.. ఓటు వినియోగించుకుంటాం
[ 20-04-2024]
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. -
నగదు చోరీలో ఇంటి దొంగలు
[ 20-04-2024]
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. -
నామినేషన్ల వేళ.. తీరుమారని వైకాపా
[ 20-04-2024]
గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
‘సొంత చెల్లినే గెంటేసిన వ్యక్తి జగన్’
[ 20-04-2024]
కష్టకాలంలో తనను ఆదుకున్న సొంత చెల్లినే బయటకు గెంటేసిన వ్యక్తి సీఎం జగన్ అని తెదేపా జోన్-4 పరిశీలకుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి వివరించారు. -
నామపత్ర సంబరం
[ 20-04-2024]
నామపత్రాల సమర్పణకు శుక్రవారం సుమూహూర్తం కావడంతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. -
కోలాహలంగా ఎరిక్షన్బాబు నామినేషన్
[ 20-04-2024]
యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు శుక్రవారం నామినేషన్ వేశారు. -
వీధిన పడ్డ బతుకులు
[ 20-04-2024]
ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. -
తెదేపాలో చేరికల ఉత్సాహం
[ 20-04-2024]
దర్శి తెదేపాలో చేరికల జోరు కొనసాగుతోంది. పలువురు నాయకులు, కార్యకర్తలు అధికార వైకాపాను వీడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు