పార్టీని గెలిపించాలి
యర్రగొండపాలెం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబుతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం సమావేశమయ్యారు. విజయవాడలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఇన్ఛార్జి మీరేనని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని..
ఎరిక్షన్బాబుతో తెదేపా అధినేత చంద్రబాబు
ఎరిక్షన్బాబుతో మాట్లాడుతున్న చంద్రబాబు
యర్రగొండపాలెం, న్యూస్టుడే: యర్రగొండపాలెం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబుతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం సమావేశమయ్యారు. విజయవాడలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఇన్ఛార్జి మీరేనని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని.. అందరినీ కలుపుకొనిపోవాలని ఎరిక్షన్బాబుకు సూచించినట్లు తెలిసింది. ఈ విషయమై బుధవారమే నియోజకవర్గ సీనియర్ నేత డాక్టర్ మన్నే రవీంద్రను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని రవీంద్ర చెప్పినట్లు తెలిసింది. కాగా పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఎరిక్షన్బాబు ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా ఎరిక్షన్బాబుకు సంకేతం అందినట్లేనని నాయకులు హర్షం వ్యక్తంచేస్తూ దోర్నాలలో బాణసంచా కాల్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె