logo

ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభించాలి

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల

Published : 30 Sep 2022 06:39 IST

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో ఓబులేసు

ఒంగోలు గ్రామీణం: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు ఉన్నందున అక్టోబర్‌ ఒకటి నుంచి నవంబర్‌ ఏడో తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇతర ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో ఓబులేసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని