సోదరుడి కుమారుడినంటూ మోసానికి యత్నం
సోదరుడి కుమారుడిని అంటూ ఫోన్ చేసిన ఆగంతుకుడు... ఓ పారిశ్రామికవేత్త నుంచి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించాడు. చివరి నిమిషంలో విషయం గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రోత్సెంటర్లో కర్మాగారం నిర్వహిస్తున్న మండవ రత్నాకరరావుకు...
చివరి నిమిషంలో గుర్తించి పోలీసులకు ఫిర్యాదు
మద్దిపాడు, న్యూస్టుడే: సోదరుడి కుమారుడిని అంటూ ఫోన్ చేసిన ఆగంతుకుడు... ఓ పారిశ్రామికవేత్త నుంచి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించాడు. చివరి నిమిషంలో విషయం గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రోత్సెంటర్లో కర్మాగారం నిర్వహిస్తున్న మండవ రత్నాకరరావుకు... ఈ నెల 27న మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి గొంతు మార్చి... ఆయన సోదరుడి కుమారుడిలా మాట్లాడాడు. చిన్న సమస్య ఉంది... రూ.60 వేలు కావాలని అడిగాడు. వెంటనే ఫోన్పే చేయాలని కోరాడు. సోదరుడి కుమారుడిగానే భావించిన రత్నాకరరావు... ప్రస్తుతం తన వద్ద అంత మొత్తం లేదని, ఇంటికి వెళ్లి తీసుకోవాలని చెప్పారు. తాను ప్రస్తుతం విజయవాడలో ఉన్నానని, ఖాతాలో జమ చేయాలని చెప్పి ఓ నంబరు పంపించాడు. అది వేరేవారి ఖాతా కావడంతో... ఇది ఎవరిదని అడిగారు. అది తన స్నేహితుడిదని చెబుతూ అవతలి వ్యక్తి తడబడడంతో... రత్నాకరరావు అనుమానించారు. వెంటనే తన సోదరుడి ఇంటికి ఫోన్ చేయగా... వారి కుమారుడు బెంగళూరులో ఉన్నట్లు చెప్పారు. ఫోన్ చేసింది కూడా ఆయన కాదని తేలింది. ఇంతలో ఆగంతుకుడి నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. నా స్నేహితుడు దుబాయ్ నుంచి బంగారం తెచ్చాడని... తక్కువ ధరకే ఇస్తాం, తీసుకుంటారా అని అడిగాడు. తన దగ్గరకు వస్తే తీసుకుంటానని చెప్పగా... మీరే రూ.5 లక్షలు తీసుకుని రావాలని చెప్పాడు. ఇంతకీ నువ్వు ఎవరివని రత్నాకరరావు గట్టిగా నిలదీయడంతో ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబరు ఆధారంగా ఆరా తీయగా... మేదరమెట్లకు చెందిన వ్యక్తిగా తేలింది. ఇదే తరహాలో ఓ వ్యక్తి నుంచి రూ.లక్షకు పైగా నగదు కాజేసినట్లు తేలింది. ఘటనపై మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!