కబ్జా చెరలో కొండ భూములు
కాదేదీ కబ్జాకు అనర్హమన్న రీతిలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఏకంగా రూ.15 కోట్ల విలువైన భూములను గుప్పెట్లో పెట్టుకున్నా యంత్రాంగం అటు కన్నెత్తి చూడటంలేదు. కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ రేగడపల్లి, అంభాపురం, గనివినపాడు రెవెన్యూ పరిధిలో పెద్దఎత్తున కొండ భూములున్నాయి.
687 ఎకరాల్లో తిష్ఠ వేసిన అక్రమార్కులు
కొనకనమిట్ల, న్యూస్టుడే:
గనివినపాడు కొండ భూములను ఆక్రమించి వేసిన పత్తి పంట
కాదేదీ కబ్జాకు అనర్హమన్న రీతిలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఏకంగా రూ.15 కోట్ల విలువైన భూములను గుప్పెట్లో పెట్టుకున్నా యంత్రాంగం అటు కన్నెత్తి చూడటంలేదు. కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ రేగడపల్లి, అంభాపురం, గనివినపాడు రెవెన్యూ పరిధిలో పెద్దఎత్తున కొండ భూములున్నాయి. ఇవి దొనకొండ పరిశ్రమ కారిడార్కు సుమారు 8 కి.మీ దూరంలో ఉండటంతో విలువ పెరిగింది. అంభాపురం సర్వే నంబరు-1లో 573 ఎకరాలు ఉండగా అందులో సుమారు 200 ఎకరాలు, వాగుమడుగు సర్వే నం.2లో 626 ఎకరాలు ఉండగా 300 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. గనివినపాడు సర్వే నం. 61, 69, 79, 86లో ఉన్న 187 ఎకరాలను కొందరు దశలవారీగా ఆక్రమించి పంటలు సాగు చేశారు. గతేడాది కంది, పత్తి పంట వేయగా ఈ సారి ఖరీఫ్లో కంది, పత్తి వేయడం గమనార్హం. రీ సర్వేతో వీటికీ పాసు పుస్తకాలు సృష్టించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో స్థానిక కాపరులు తమ పశువులు, మూగ జీవాలను మేత కోసం ఈ భూముల వద్దకు తీసుకుకెళ్లేవారు. ప్రస్తుతం వీరు అటువైపు రాకుండా ఆక్రమార్కులు అడ్డుకుంటున్నారు.
జాతీయ రహదారికి సమీపంలోనే..: వర్షాలు కురిసినప్పుడు ఈ కొండల్లోంచి సమీప కుంటల్లోకి నీరు చేరేది. ఇవన్నీ ఆక్రమణల్లో ఉండటంతో ప్రస్తుతం ఆ అవకాశం లేకుండాపోయింది. రెవెన్యూ అధికారులు నిత్యం రాకపోకలు సాగించే జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఈ భూములున్నాయి. గవినినపాడు పంచాయతీలో కొండ భూముల ఆక్రమణపై పలుమార్లు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందనలోనూ వినతులు వెళ్లాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సర్పంచి లక్ష్మి వెంకటేశ్వర్లు కోరారు.
నోటీసులు జారీ చేస్తాం
కొండ భూములు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్న వారికి నోటీసులిస్తాం.. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం.
- ప్రసాదరావు, తహసీల్దార్, కొనకనమిట్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్