ఏఆర్ విభాగంలో బదిలీల రగడ
పోలీసు శాఖలోని ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) విభాగంలో బదిలీలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాల పునర్విభజన అనంతరం చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలతో ఏర్పాటైన బాపట్ల.. కందుకూరు నియోజకవర్గాన్ని విలీనం చేసుకున్న నెల్లూరు జిల్లాలకు ఆయా నిష్పత్తిని అనుసరించి సిబ్బందిని కేటాయించారు.
అన్యాయం జరిగిందంటూ న్యాయస్థానానికి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే
పోలీసు శాఖలోని ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) విభాగంలో బదిలీలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాల పునర్విభజన అనంతరం చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలతో ఏర్పాటైన బాపట్ల.. కందుకూరు నియోజకవర్గాన్ని విలీనం చేసుకున్న నెల్లూరు జిల్లాలకు ఆయా నిష్పత్తిని అనుసరించి సిబ్బందిని కేటాయించారు. సివిల్ విభాగంలోనూ కేటాయింపులు జరిగిన్పటికీ ఆయా స్టేషన్లు వెళ్లిన జిల్లాలకే దాదాపుగా కేటాయించారు. దీంతో పెద్దగా సమస్య ఎదురుకాలేదు. ప్రత్యేకించి ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఈ ప్రక్రియ తేనెతుట్టెను కదిపినట్లయింది. వీరు పూర్తిగా జిల్లాకేంద్రంగానే పనిచేస్తారు. బందోబస్తులు, గార్డు డ్యూటీలు, ఎస్కార్టు విధుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం ఒంగోలు కేంద్రంగా ఉన్న డీఆఏర్(డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్) సిబ్బందిని బాపట్ల, నెల్లూరు జిల్లాలకు కేటాయించడంలో జరిగిన అవకతవకలు చర్చకు దారితీశాయి. పోలీసు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు నిబంధనలు పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా జాబితాలు తయారు చేశారనేది కొందరి అభియోగం. నెల్లూరు జిల్లాకు పంపాల్సిన జాబితాను ఒక నెలలో ఏకంగా మూడుసార్లు మార్చివేసి ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకపక్షంగా జాబితాలు తయారుచేశారని.. ఉన్నతాధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలంటూ కొందరు ఇప్పటికే మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి విన్నవించారు. ఈ విషయంపై వివాదం నడుస్తుండటంతో జిల్లా ఎస్పీ మలికా గార్గ్ గత సోమవారం ఏఆర్ విభాగానికి చెందిన సిబ్బంది కుటుంబీకులను పిలిపించి మాట్లాడారు. అక్కడ తమ కుటుంబీకుల ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువుల వంటి విషయాలను చెప్పిన సిబ్బంది బదిలీలు ఏకపక్షంగా జరిగాయని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇది రాష్ట్ర విధానమని.. ముందు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలని సూచించారు. దీనికి అంగీకరించని సిబ్బంది కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, మరికొందరు అదేబాటలో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఏఆర్లో అంతర జిల్లాల బదిలీల ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.