వైకాపా, తెదేపాలకు ప్రత్యామ్నాయం మేమే
అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్న అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాలకు... రాష్ట్రంలో జనసేనతో కలిసి తామే ప్రత్యామ్నాయమని భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ పేర్కొన్నారు.
భాజపా రాష్ట్ర సహ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ వెల్లడి
ప్రజాపోరు యాత్ర ముగింపు సభలో మాట్లాడుతున్న భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్, చిత్రంలో నాయకులు
ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్టుడే: అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్న అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాలకు... రాష్ట్రంలో జనసేనతో కలిసి తామే ప్రత్యామ్నాయమని భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ పేర్కొన్నారు. ప్రజాపోరు యాత్ర ముగింపు సందర్భంగా ఒంగోలులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాబు వస్తే జాబు వస్తుందన్న నినాదంతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కుమారుడికే జాబ్ ఇచ్చారన్నారు. అలాగే నేను ఉన్నాను, నేను విన్నాను.. అంటూ అధికారం చేపట్టిన జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. ఆదాయ వనరులు, పారిశ్రామిక ప్రగతి లేక... రాష్ట్రాన్ని అప్పులకుప్పలా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం అప్పులపై ఆధారపడి పాలన సాగిస్తున్నారని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. భూ, ఇసుక, గ్రానైట్, మద్యం, ఎర్రచందనం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. దేశ రాజధాని దిల్లీలో మద్యం మాఫియాకు సంబంధించి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు బయటపడి, సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తుంటే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర పురపాలక శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ క్రిస్టియన్ అయి ఉండి ఎస్సీ కోటాలో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవిని అనుభవిస్తున్నారని విమర్శించారు. తన అధికారాన్ని వినియోగించుకుని మత మార్పిడులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కోటా సీట్లలో హిందూ దళితులే పోటీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 95 శాతం హిందువుల నుంచి పన్నులు వసూలు చేసి... వాటి నుంచి ఇమామ్లు, పాస్టర్లకు వేతనం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కుటుంబపార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో భాజపా పొలిటికల్ ఫీడ్బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్, జిల్లా అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ