అంధుడి పింఛను కాజేసిన వాలంటీరు
ఓ అంధుడికి మంజూరైన పింఛను సొమ్మును 23 నెలలుగా నొక్కేస్తున్నాడు ఓ వాలంటీర్. దివ్యాండుడి బంధువైన ఓ మహిళకు అనుమానం వచ్చి సచివాలయంలో ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది.
మోసాన్ని గుర్తించిన బంధువు.. నగదు తిరిగి ఇప్పించిన సంఘం ప్రతినిధులు
దివ్యాంగుడు షేక్ మస్తాన్బాషాకు నగదు అందజేస్తున్న వాలంటీర్ల సంఘం ప్రతినిధులు
పామూరు, న్యూస్టుడే: ఓ అంధుడికి మంజూరైన పింఛను సొమ్మును 23 నెలలుగా నొక్కేస్తున్నాడు ఓ వాలంటీర్. దివ్యాండుడి బంధువైన ఓ మహిళకు అనుమానం వచ్చి సచివాలయంలో ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది. దీంతో వాలంటీర్ల సంఘం నాయకులు కల్పించుకొని బాధితుడికి అప్పటికప్పుడు రూ.69 వేలు ఇప్పించి న్యాయం చేశారు. ఈ సంఘటన పామూరు-3వ సచివాలయం పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక కొత్త వాటర్ ట్యాంకు వీధిలో నివసిస్తున్న అంధుడు షేక్ మస్తాన్ బాషాకు 2020 సెప్టెంబరులో ప్రభుత్వం దివ్యాంగ పింఛను మంజూరు చేసింది. అయితే వాలంటీరు పి.వెంకటకృష్ణ మాత్రం పింఛను మంజూరు కాలేదని, దరఖాస్తు చేస్తున్నానంటూ ప్రతి నెలా మస్తాన్ బాషాతో వేలిముద్ర వేయించుకుంటూ నగదు తన సొంతానికి వాడుకున్నారు. మస్తాన్ బాషా తల్లి షేక్ ఖాజాబీకి వృద్ధాప్య పింఛను వస్తోంది. వారి కుటుంబానికి ఈ నగదే ఆధారం. ప్రతి నెలా తల్లి వేలిముద్ర వేయించుకొని నగదు ఇస్తూ, మస్తాన్ బాషాకు మాత్రం పింఛను కోసం దరఖాస్తు చేస్తున్నానని, మంజూరైందో లేదో చెక్ చేస్తున్నానంటూ 23 నెలలుగా నగదు కాజేశారు. శనివారం వేలిముద్ర వేయించుకోవడానికి వచ్చిన సమయంలో బాధితుడి బంధువైన ఓ మహిళ అక్కడే ఉండి ప్రశ్నించడంతో వాలంటీరు తడబడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అనుమానం వచ్చిన సదరు మహిళ శనివారం సాయంత్రం స్థానిక సచివాలయానికి వెళ్లి అధికారులకు విషయం చెప్పగా 23 నెలల క్రితమే పింఛను మంజూరైన విషయం బయటపడింది. ఎంపీడీవో, ఈవోఆర్డీ ఇతర అధికారులకు ఈ విషయం తెలిసింది. ఆదివారం సంక్షేమ, విద్య సహాయకుడు ఎస్డీ షరీఫ్ దివ్యాంగుడి ఇంటికి వెళ్లి ఈ నెల ఇవ్వాల్సిన రూ.3 వేలు పింఛను ఇచ్చారు. వాలంటీరు మోసం చేసిన విషయం బహిర్గతం కావడంతో వాలంటీర్ల సంఘం అధ్యక్షులు షేక్ సుభాని, ఎండీ గౌష్, సభ్యులు షలీంలు లబ్ధిదారుడు మస్తాన్బాషా ఇంటికి వెళ్లి మాట్లాడారు. అనంతరం వాలంటీరు వెంకటకృష్ణతో మాట్లాడి 23 నెలలకు గాను ఇవ్వాల్సిన మొత్తం సొమ్ము రూ.69 వేలను బాధితుడికి వెంటనే ఇప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్