నీటిని ఇంకిద్దాం.. మొక్కలు పెంచేద్దాం
గ్రామాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఏటా ముందస్తుగా గ్రామసభలు ఏర్పాటుచేసి రానున్న సంవత్సరానికి అవసరమైన పనుల గుర్తింపు చేపడుతుంటారు.
2023-24 సంవత్సర ఉపాధి పనుల్లో వీటికే పెద్దపీట
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: గ్రామాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఏటా ముందస్తుగా గ్రామసభలు ఏర్పాటుచేసి రానున్న సంవత్సరానికి అవసరమైన పనుల గుర్తింపు చేపడుతుంటారు. వాన నీటిని భూగర్భంలో సంరక్షించే పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి కూడా ఉపాధి కింద ఇవే అగ్రభాగం. అలాగే పండ్లతోటల సాగు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కల పెంపకం వంటివి ఉంటాయి.
120 రకాల పనులకు అనుమతి
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 120 రకాల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి గ్రామంలో ఉపాధి కార్డు పొందిన కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పిస్తారు. కొత్త పనుల గుర్తింపు నిమిత్తం ఈ నెల 2 న గ్రామసభలకు శ్రీకారం చుట్టారు. సెలవులు రావడంతో ఈ నెల 6 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో సభలు నిర్వహించనున్నారు.
ఏవి చేపట్టనున్నారంటే..
నీటి సంరక్షణ, నీటి నిల్వలో భాగంగా వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, చెక్డ్యామ్లలో పూడికతీత పనులు చేస్తారు. పొలం చుట్టూ సరిహద్దు, అంతర్గత కందకాలు, కుంటలు, ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్లు వంటివి చేపట్టనున్నారు. రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, చెరువులు, కుంటల కట్టలు, రైతుల పొలాలు, ఉద్యాన పండ్లతోటల సాగు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతారు. జిల్లాలో కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డ్వామా పీడీ శీనారెడ్డి తెలిపారు. నవంబరు 13లోపు గ్రామ సభల ద్వారా వచ్చే ఏడాదికి పనులను గుర్తించనున్నామన్నారు.
* 2022-23లో ఉపాధి కార్డులు: 5.95 లక్షలు
* పనులకు వచ్చిన కుటుంబాలు: 3.09 లక్షలు
* ప్రస్తుత ఏడాది పని దినాల లక్ష్యం: 1.20 కోట్లు
* ఇప్పటివరకు పూర్తయిన పని దినాలు: 1.36 కోట్లు
* రోజుకు సరాసరి వేతనం: రూ.257
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇట్లుంటది జగన్ తోని.. ఒంగోలు బ్రాండ్కే బ్యాండ్
[ 23-04-2024]
రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. -
జన బలం జాతర..
[ 23-04-2024]
జన బలానికి.. ప్రలోభాల పర్వానికి ఈ రెండు చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సోమవారం నామినేషన్ల దాఖలు సందడి నెలకొంది. -
అయిదేళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా!
[ 23-04-2024]
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన జగన్.. అయిదేళ్లలో ఉత్తుత్తి పనులు చేసి చివరిలో శిలాఫలకాలు వేశారు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా కనీసం మరమ్మతులు చేయించలేని జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు’... అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పడుతూ లేస్తూ పది ఫలితాలు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గత అయిదేళ్లుగా పడుతూ లేస్తూ వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 73.74 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రస్తుతం ఆ శాతం 91.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
89.97 శాతం ఉత్తీర్ణత
[ 23-04-2024]
2023-24 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి ఫలితాల్లో 89.97 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 60 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో మొత్తం 887 మంది విద్యార్థులుండగా, అందులో 798 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పసివారి పైనా పాలకుడి పడగ
[ 23-04-2024]
పసి వారిపైనా ముఖ్యమంత్రి జగన్ పగబట్టారు. ఆయన నిర్ణయంతో ఈ భావి సంపద నీరుగారిపోతోంది. ‘పది రూపాయలు’ మిగుల్చుకుందామని అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. -
తాగు.. తూలు.. జైకొట్టు
[ 23-04-2024]
‘బాబ్బాబూ.. నామినేషన్ వేస్తున్నాం. కాస్తంత అక్కడి వరకు వచ్చిపోండి. ఊరకనే కాదు అయిదొందల నోటు, క్వార్టర్ సీసా ఇస్తాం. పసందైన బిర్యానీ కూడా పెట్టిస్తాం. మందు తాగి మా పార్టీ జెండా పట్టుకుని జేజేలు కొడితే చాలు’ ఇదీ ప్రస్తుతం నామినేషన్ల సందర్భంగా వైకాపా అభ్యర్థుల ప్రదర్శనల్లో నాయకుల బతిమలాటలు. -
బాబ్బాబు.. రాజీనామా చేయరూ..!
[ 23-04-2024]
వైకాపా నేతలు తమ సైన్యం అనుకున్న వాలంటీర్లు ఇప్పుడు వారి మాట వినడం లేదు. రాజీనామా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని దొనకొండ మండల సచివాలయాల కన్వీనర్ గుంటు పోలయ్య తమ గ్రూపులో సోమవారం విజ్ఞప్తి చేశారు. -
నాలుగో రోజు 42 మంది నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నాలుగో రోజైన సోమవారం 42 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. -
చోరీ కేసు నిందితుడి విషాదాంతం
[ 23-04-2024]
చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఏరులై పారిన మద్యం
[ 23-04-2024]
మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు. -
జగనన్న కాలనీలా.. చిట్టడవులా!
[ 23-04-2024]
‘రాష్ట్రంలో ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నా’మంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న జగనన్న కాలనీలు చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి