దసరా పిలిచింది
దసరాకు వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. గత నెల 29 నుంచి ఈనెల 3వ తేదీ వరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులను నడిపారు. గతంతో పోల్చుకుంటే శని, ఆదివారాలు మినహా ఈసారి ప్రయాణికుల రద్దీ తగ్గింది.
మార్కాపురం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోలాహలం
ఒంగోలు అర్బన్, కనిగిరి, న్యూస్టుడే: దసరాకు వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. గత నెల 29 నుంచి ఈనెల 3వ తేదీ వరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులను నడిపారు. గతంతో పోల్చుకుంటే శని, ఆదివారాలు మినహా ఈసారి ప్రయాణికుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి జిల్లాకు 70 ప్రత్యేక సర్వీసులు తిరిగాయి. మిగిలిన రెండు నగరాలకు సాధారణ సర్వీసులతో పాటు అదనంగా రెండు నడిపారు. కేవలం 50 శాతం ప్రయాణికులతో తిరగగా సంస్థకు రూ.16 లక్షల రాబడి వచ్చింది. దసరా పండగ పూర్తయిన తరువాత తిరిగి హైదరాబాద్కు అవసరాన్ని బట్టి సర్వీసులు నడుపుతామని అధికారులు తెలిపారు.
స్వస్థలాలకు రాక..
కనిగిరి ప్రాంత వాసులు తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు. పండగ కోసం హైదరాబాద్, సికింద్రాబాద్, బోధన్, నిర్మల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, వలస కూలీలు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అధికారులు ప్రత్యేకంగా కనిగిరి డిపో నుంచి హైదరాబాద్కు 15 బస్సులను ఏర్పాటుచేశారు. వారం పాటు సర్వీస్లు తిప్పడంతో డిపోకు సుమారు రూ.5 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు మేనేజర్ శ్రీమన్నారాయణ తెలిపారు. గతంలో అధికంగా వలస కుటుంబాలు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చేవారని, ప్రస్తుతం ముందుగానే ప్రచారం నిర్వహించి వారం రోజులుగా బస్సులు నడిపామన్నారు.
డిపో వారీగా చూస్తే..
జిల్లాలో దసరా సందర్భంగా ఆర్టీసీ 101 ప్రత్యేక బస్సులను కేటాయించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తగ్గడంతో వీటిలో 70 మాత్రమే నడిచాయి. 29న హైదరాబాద్ నుంచి 3.. 30న 13, అక్టోబర్ 1న 30, అలాగే 2 న 16, 3న కేవలం రెండు సర్వీసులు మాత్రమే నడిచాయి. ఒంగోలు డిపోకు 31 బస్సులు కేటాయించగా 15 మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ నుంచి కనిగిరికి 15, గిద్దలూరు డిపోకు 14, మార్కాపురం 11, పొదిలికి 11 వచ్చాయి. అదే క్రమంలో చెన్నై నుంచి కనిగిరికి 4, బెంగుళూరు నుంచి ఒంగోలుకు కేవలం ఒక్క బస్సు నడిచాయి. కొన్ని సంస్థలు పండుగకు కేవలం ఒక రోజు మాత్రమే సెలవు ఇవ్వడంతో ఎక్కువమంది సొంత ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. మరో వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తుండటంతో వారి తాకిడి కూడా లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం