పరిమితికి మించి సాగు అనర్థమే
పొగాకు ఎక్కువ మొత్తంలో పండించొద్దని అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు రైతులు లాభాల ఆర్జించడంతో సాగు విస్తీర్ణం పెంచే ఆలోచనలో ఉన్నారు.
పొగాకు రైతులకు అధికారుల సూచన
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని హితవు
పొగాకు పంట
పొగాకు ఎక్కువ మొత్తంలో పండించొద్దని అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు రైతులు లాభాల ఆర్జించడంతో సాగు విస్తీర్ణం పెంచే ఆలోచనలో ఉన్నారు. బోర్డు అధికారులు మాత్రం పరిమితికి సాగు చేయవద్దని సూచిస్తుండటం గమనార్హం. ఇప్పటికే అన్ని వేలం కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ పంటతో పాటు ప్రత్యామ్నాయంగా బొబ్బర్లు, మినుము, శనగ, మొక్కజొన్న, కంది, పెసర తదితరాలను కొంత విస్తీర్ణం మేర సాగు చేసుకోవాలని చెబుతున్నారు. అధిక ధరలు చెల్లించి బ్యారన్లు కౌలుకు తీసుకుంటే రైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
పొదిలి, న్యూస్టుడే
జిల్లాలో పొగాకు నాట్లు ప్రారంభమయ్యాయి. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ ప్రాంతంలోని రైతాంగం నాట్లకు ఉపక్రమించారు. ముందస్తుగా నారుమడులు వేసిన రైతులు నారు తీయడం ప్రారంభించారు. మరో 15 రోజులకు పూర్తిస్థాయిలో నారు రైతులకు అందుబాటులో రానుంది. ఈ ఏడాది జిల్లాలోని ఎస్ఎల్ఎస్ రీజియన్లో 29.13 మిలియన్ కిలోలు, ఎస్బీఎస్లో 36.95 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. పొగాకు బ్యారన్ రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఎస్ఎల్ఎస్లో 8011 బ్యారన్లు, 11,420 మంది రైతులు 21708 హెక్టార్లలో, ఎస్బీఎస్ పరిధిలో 10350 బ్యారన్లు, 11972 మంది రైతులు 21,737 హెక్టార్లలో పంటసాగుకు అనుమతించారు.
కర్ణాటకలో తగ్గిన ఉత్పత్తి...
కర్ణాటకలో ఈ ఏడాది కూడా పొగాకు పంట ఉత్పత్తి తగ్గింది. అనుమతించిన పంట కన్నా దాదాపు 35 శాతం పైగా తగ్గినట్లు అధికారులు అంటున్నారు. గత రెండేళ్లుగా పొగాకు బోర్డు అనుమతించిన దాని కన్నా కర్ణాటకలో పంట ఉత్పత్తి తగ్గగా సగటు ధరలు పెరిగాయి. గత ఏడాది అక్కడ పంట తగ్గడం వల్ల ఆంధ్రాలో మార్కెట్ ఒకింత జోరుగా సాగింది. దీంతో పొగాకు రైతులు లాభాల బాట పడ్డారు.అక్కడ 2022-23 పంట కాలానికి వంద మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించినప్పటికీ అధిక వర్షాల ప్రభావంతో 70 మిలియన్ల కన్నా ఎక్కువ పంట ఉత్పత్తి వచ్చే అవకాశం లేదు. అక్కడ పంట ఉత్పత్తి తగ్గిన నేపధ్యంలో మన జిల్లాలో పొగాకు సాగు విస్తీర్ణం పెంచే ఆలోచనలో రైతులు ఉన్నట్లు తెలిసింది. బోర్డు అధికారులు మాత్రం పరిమితికి మించి పొగాకు సాగు చేయవద్దని సూచిస్తున్నారు.
అనుమతించిన మేరకే...
పొగాకు రైతులు అధిక విస్తీర్ణంలో పంట సాగు చేయొద్దు. బోర్డు ఆదేశాల మేరకు ఒక్కొక్క బ్యారన్కు 7.22 ఎకరాల్లో పంట సాగు చేసుకోవాలి. బ్యారన్కు 3650 కిలోల పొగాకు అధికారికంగా ఉత్పత్తికి అనుమతించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున రైతులు ఇప్పుడే నాట్లు వేసుకోవాలి. పొదిలి వేలం కేంద్రంలో 8.5 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతించాం..
- గిరిరాజ్కుమార్, వేలం కేంద్రం నిర్వహణ అధికారి, పొదిలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?