ఎకో టూరిజంలో పర్యాటకుల సందడి
నల్లమల అటవీ ప్రాంతంలోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న ఎకోటూరిజంలో మంగళవారం పర్యాటకులు సందడి చేశారు. రెండు నెలల విరామం తర్వాత పునఃప్రారంభించడంతో పర్యాటకుల రాక మొదలైంది.
జంగిల్ సఫారీలో బాణం సంధిస్తున్న పీసీసీఎఫ్ సుమన్
పెద్దదోర్నాల, న్యూస్టుడే: నల్లమల అటవీ ప్రాంతంలోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న ఎకోటూరిజంలో మంగళవారం పర్యాటకులు సందడి చేశారు. రెండు నెలల విరామం తర్వాత పునఃప్రారంభించడంతో పర్యాటకుల రాక మొదలైంది. విజయదశమి సెలవులు కావడంతో పాటు శ్రీశైలంలో జరుగుతున్న భ్రమరాంబిక దేవి బ్రహ్మోత్సవాలు వీక్షించేందుకు వెళ్లే భక్తులు ఎకోటూరిజాన్ని సందర్శిస్తున్నారు. జిప్సీ వాహనంలో అడవిలో విహరిస్తున్నారు. ఒక్కొక్కరికి టికెట్ రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. జిప్సీ వాహనంలో ఆరు మందికి అనుమతిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రేంజర్ విశ్వేశ్వరరావు తెలిపారు.
అభివృద్ధి పనుల పరిశీలన : నల్లమల అటవీ ప్రాంతాన్ని పీసీసీఎఫ్(బడ్జెట్) అధికారి ఆర్.కె.సుమన్ మంగళవారం సందర్శించారు. పెద్దదోర్నాల-శ్రీశైలం రహదారిలోని జంగిల్ సఫారీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూశారు. ప్రస్తుతం రెండు జిప్సీ వాహనాలు ఉన్నాయని మరొకటి కావాలని స్థానిక అటవీ అధికారులు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ త్వరలో వాహనాన్ని కేటాయిస్తామన్నారు. సఫారీ లోని వ్యూ పాయింట్ వాచ్టవర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని అధికారులు కోరారు. అనంతరం ఆయన ఇష్టకామేశ్వరీ ఆలయం ప్రదేశాన్ని సందర్శించారు. ఆయన వెంట మార్కాపురం డివిజన్ అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు, రేంజర్ విశ్వేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.