రాజుకుంటున్న రాజకీయ వేడి
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా జిల్లాలోనూ సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీలోని నాయకులు ఒకవైపు గ్రూపులతో సతమతం అవుతున్నప్పటికీ తాజాగా మూడు రాజధానుల అంశంతో కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈనాడు డిజిటల్, ఒంగోలు: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా జిల్లాలోనూ సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీలోని నాయకులు ఒకవైపు గ్రూపులతో సతమతం అవుతున్నప్పటికీ తాజాగా మూడు రాజధానుల అంశంతో కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఏకైక రాజధాని అమరావతి అజెండాగా తెదేపా ముందుకెళ్తుంది. 2024లో జరగనున్న ఎన్నికలను ఇరుపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు గుర్రాలను వడపోసి బరిలోకి దించే ప్రయత్నాలు చేపట్టాయి. ఒకవైపు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జులతో నేరుగా మాట్లాడి దిశానిర్దేశం చేస్తున్నారు. కొండపిలో ఎమ్మెల్యే స్వామి మరోసారి పోటీచేయనుండగా మరో నాలుగు చోట్ల పోటీ చేసే అభ్యర్థులకు పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజాప్రతినిధులను జనాల్లోకి పంపిన అధికారపార్టీ ప్రతి అంశం పరిశీలిస్తోంది. ఈనెల 15 నుంచి ఎమ్మెల్యేల కార్యక్రమాన్ని సర్వే బృందం గమనించనుంది.
పోటాపోటీగా చేరికలు ..
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఒకవైపు భూములిచ్చిన రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి అంటూ ప్రధాన ప్రతిపక్షం తెదేపా స్పష్టంచేస్తోంది. మూడు రాజధానులే తమ విధానం అంటూ వైకాపా విమర్శలు గుప్పిస్తోంది. ఇదే అంశంపై వైకాపా జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ విజయదశమి రోజున పూజా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించి పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా.. వైకాపా నాయకులకు ప్రజలే బుద్దిచెబుతారని తెదేపా నాయకులు దీక్షల్లో వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గాల్లో పట్టుపెంచుకునే ప్రయత్నాలను తెదేపా మొదలు పెట్టింది. కనిగిరి, గిద్దలూరు, ఒంగోలు, మార్కాపురం, కొండపి వంటి నియోజకవర్గాల్లో వందలమంది ఇప్పటికే తెదేపాలో చేరారు. వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ పార్టీలోకి వెళ్లినవారు, మూడేళ్లలో స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారు తెదేపాలో చేరుతున్నారు. రెండు రోజులక్రితం ఒంగోలు నగరంలో వందలమంది యువకులు దామచర్ల జనార్దన్ సమక్షంలో తెదేపాలో చేరారు. దీనికి పోటీగా మరుసటి రోజే కొందరు యువకులకు వైకాపా కండువాలు కప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్