సాగర్ కాలువలో యువ వైద్యుడి గల్లంతు
ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి యువ వైద్యుడు గల్లంతైన సంఘటన త్రిపురాంతకం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.
త్రిపురాంతకం, న్యూస్టుడే: ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి యువ వైద్యుడు గల్లంతైన సంఘటన త్రిపురాంతకం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు..గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన ఉదయగిరి భరత్ (23) అనే యువకుడు తన బంధువుల ఇంట్లో జరిగే ఓ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనేందుకు త్రిపురాంతకం వచ్చారు. బంధువులైన ఇద్దరు యువకులతో కలిసి సమీపంలోని సాగర్ కాలువకు వెళ్లారు. వారిద్దరూ ఈత కొడుతుండగా భరత్ తన చరవాణితో వీడియో తీస్తూ ప్రమాదవశాత్తు జారి కాలువలో పడ్డాడు. పక్కనే ఈత కొడుతున్న ఇద్దరు యువకులు అతడిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాలువలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న భరత్ తల్లి అరుణ సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ మేరకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై వెంకట సైదులు తెలిపారు. భరత్ తన అన్నతో కలిసి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం అన్నా, తమ్ముడు ఇద్దరూ విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతలో ఈ ఘటన చోటు చేసుకుంది.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఒంగోలు అర్బన్, న్యూస్టుడే: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. పేర్నమిట్ట రెడ్డిపాలెం సమీపంలో ఈ నెల 2న కారు ఢీకొని... మంగమూరుకు చెందిన తేళ్ల ప్రేమనాథం తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. తెదేపా నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
విషజ్వరంతో మహిళ మృతి
కంభం, న్యూస్టుడే : విషజ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన సంఘటన కంభం మండలం కందులాపురం పంచాయతీ అరాఫత్ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆ ప్రాంతానికి చెందిన జె.అరుణ (32) ఇటీవల జ్వరం బారిన పడింది. పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గలేదు. పలు రకాల పరీక్షలు చేయించడంతో డెంగీ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అరుణకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు