ఎట్టకేలకు మాజీ వాలంటీరు విడుదల
నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరంలో ‘గడప గడపకు..’ కార్యక్రమాన్ని అడ్డుకొన్న ఎస్సీ కాలనీ వాసులపై కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మాజీ వాలంటీరును పోలీసులు స్టేషన్లోనే నిర్బంధించి విడిచిపెట్టకపోవడం విమర్శలకు తావిచ్చింది.
రెండురోజుల పాటు స్టేషన్లోనే నిర్బంధం
నాగులుప్పలపాడు, న్యూస్టుడే: నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరంలో ‘గడప గడపకు..’ కార్యక్రమాన్ని అడ్డుకొన్న ఎస్సీ కాలనీ వాసులపై కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మాజీ వాలంటీరును పోలీసులు స్టేషన్లోనే నిర్బంధించి విడిచిపెట్టకపోవడం విమర్శలకు తావిచ్చింది. మంగళవారం సాయంత్రం మొదలైన ఈ హైడ్రామాకు గురువారం తెరపడింది. వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 14న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబును గ్రామస్థులు, కొందరు ఎస్సీ కాలనీవాసులు అడ్డుకోగా మొత్తం 23 మందిపై కేసులు నమోదయ్యాయి. ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి పిలిచిన అనంతరం అందరినీ విడిచిపెట్టగా మాజీ వాలంటీరు నాగరేణును మాత్రం మంగళవారం నుంచి నాగులుప్పలపాడు స్టేషన్లోనే ఉంచారు.. ఎస్సీ, ఎస్టీ కేసులో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకొన్న ఆయనను 24 గంటలలోపు న్యాయస్థానానికి హాజరుపరచాల్సి ఉన్నా అలా చేయలేదు. బుధవారం రాత్రి కూడా నాగరేణును స్టేషన్లో ఉంచడంతో హైకోర్టు న్యాయవ్యాది వెంకటరామశర్మ చేరుకొని పోలీసులను ప్రశ్నించారు. ఎస్సై, సీఐలపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు తీసుకొని అందుకు సంబంధించిన రసీదు ఇవ్వాలని స్పష్టంచేశారు. దీంతో ఉన్నతాధికారులు చరవాణి ద్వారా ఆయనను సంప్రదించి సమయం ఇవ్వాలని, గురువారం నాగరేణును విడుదల చేస్తామని తెలిపారు. అప్పటికే స్థానిక పోలీస్స్టేషన్ వద్దకు చేరుకొన్న గ్రామస్థులకు న్యాయవాది ఇదే అంశాన్ని తెలిపారు. దీంతో వారు వెనుదిరిగారు. గురువారం ఉదయం 11 గంటలకు పోలీస్స్టేషన్లో ఉన్న నాగరేణుకు 41 నోటీసు అందజేసి పోలీసులు విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో