చెంచు గిరిజన మహిళలకు ఆసరా
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజన మహిళలు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా కాలాల్లో పండే ఫలాలను సేకరిస్తుంటారు. ఉసిరి, మామిడి, నిమ్మ, జామ, సీతాఫలం వంటి ఫలాలు సేకరించి విక్రయిస్తుంటారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ
స్వయం ఉపాధి దిశగా అడుగులు
తయారు చేసిన సంచులతో..
పెద్దదోర్నాల, న్యూస్టుడే: నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజన మహిళలు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా కాలాల్లో పండే ఫలాలను సేకరిస్తుంటారు. ఉసిరి, మామిడి, నిమ్మ, జామ, సీతాఫలం వంటి ఫలాలు సేకరించి విక్రయిస్తుంటారు. మిగిలిన సమయాల్లో ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు అటవీశాఖ సంకల్పించింది. అందులో భాగంగా పుట్టగొడుగుల పెంపకం, జూట్, గుడ్డ, కాగితం సంచుల తయారీలో శిక్షణ అందించి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయిస్తోంది.
పుట్టగొడుగుల పెంపకంలో..
నల్లమల అటవీ ప్రాంతంలోని పెద్దమంతనాల, చింతల, తుమ్మలబైలు, మర్రిపాలెం, చిన్నారుట్ల గూడేలాకు చెందిన 15 మంది మహిళలకు పుట్టగొడుగుల పెంపకంలో అనంతపురానికి చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించారు. చింతల చెంచు గిరిజన గూడెంలో రూ.ఒక లక్షలతో పుట్టగొడుగుల యూనిట్ ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టారు. మిగిలిన నాలుగు గూడేల్లో త్వరలో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
కాగితం సంచుల తయారీ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ప్లాస్టిక్ సంచుల నిషేధించింది. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించాలంటే ప్రత్యామ్నాయంగా కాగితం, గుడ్డ, జూట్ సంచుల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీటి తయారీలో చెంచు గిరిజన మహిళలను భాగస్వాములను చేసేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. తుమ్మల బైలు చెంచు గిరిజన గూడేనికి చెందిన 15 మంది మహిళలను హైదరాబాద్ తీసుకుని వెళ్లి అక్కడ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు గుడ్డ, కాగితం సంచుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వాటి తయారీకి అవసరమైన సామగ్రిని అటవీశాఖ అందిస్తోంది. ఈ నెల 25 నుంచి 30 వరకు స్థానిక అటవీశాఖ కార్యాలయంలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో జూట్, గుడ్డ సంచుల తయారీలో గిరిజన మహిళలకు శిక్షణ అందించనున్నారు. అందుకోసం రూ.1.35 లక్షల విలువ చేసే పది యంత్రాలను కొనుగోలు చేశారు. ఇవే కాకుండా ఉసిరి, మామిడి, నిమ్మ తదితర పచ్చళ్ల తయారీపై తర్ఫీదు ఇవ్వనున్నారు.
5 గూడేల్లో యూనిట్లు
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా అటవీశాఖ కృషి చేస్తోంది. అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములైన వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనలో శిక్షణ ఇస్తున్నాం. పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణనిచ్చి ఐదు గూడేల్లో యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం.
- విశ్వేశ్వరరావు, అటవీ క్షేత్రాధికారి, దోర్నాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయ రాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM