బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడేనా!
ఎండీయూ వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేసేందుకు మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంపిక చేశారు. ఉదాహరణకు కొత్తపట్నం మండలంలో మడనూరు గ్రామం తీసుకున్నారు.
పంపిణీ చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ
తొలివిడతగా 38 గ్రామాల్లో అమలు
ఎండీయూ వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేసేందుకు మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంపిక చేశారు. ఉదాహరణకు కొత్తపట్నం మండలంలో మడనూరు గ్రామం తీసుకున్నారు. పాకల(సింగరాయకొండ), ఎం.నిడమలూరు(టంగుటూరు), ఆర్పీ రోడ్డు, గొడుగుపాలెం(ఒంగోలు), బసవన్నపాలెం, సీతారాంపురం(మద్దిపాడు), నాగులుప్పలపాడు(నాగులుప్పలపాడు)...తదితరాలు ఎంపికైనవాటిలో ఉన్నాయి.
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై పంపిణీ చేస్తున్న బియ్యం అనేకచోట్ల అక్రమార్కుల పరమవుతున్నాయి. కార్డుదారుల ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కితం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు(ఎండీయూ) అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇంటింటికీ రేషన్ పేరుతో ఒక్కో వాహనానికి సుమారు రూ.7 లక్షల చొప్పున నిధులు ఖర్చు చేశారు. ఆపరేటర్లకు జీతాలు చెల్లిస్తున్నారు. ప్రతి ఇంటికీ సరకులు సరఫరా చేయాల్సి ఉన్నా సక్రమంగా జరగడం లేదు. వివిధ చోట్ల ఎండీయూ వాహనాలే అక్రమాలకు నిలయంగా మారాయి. ఎక్కువ శాతం కార్డుదారులకు బియ్యానికి బదులుగా కిలోకు రూ.9 నుంచి రూ.10 వరకు నగదు ఇస్తున్నట్లు గుర్తించారు. పైగా వాహనంలోనే ఆయా ప్రాంత డీలర్లు ఉండి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాలశాఖ దృష్టిపెట్టింది.
ఎండీయూ వాహనాలపై నిఘా
జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటా బియ్యం, సరకుల పంపిణీ జరుగుతోంది. ఇటీవల గుత్తేదారులకు బిల్లుల పెండింగ్ కారణంగా కార్డుదారులకు కందిపప్పు, పంచదార నిలిచిపోగా కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఇంటింటా రాకుండా వీధిలో ఓ చోట నిలిపి అక్కడకు వస్తేనే ఇస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి 5 కిలోల చొప్పున కిలో రూపాయికే సరఫరా చేస్తున్నారు. బియ్యం కొనుగోళ్లు, తరలింపులోనూ గతంలో మాదిరే అక్రమాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో డీలర్లు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు కోకొల్లలు. కొన్ని గ్రామాల్లో ఎండీయూ ఆపరేటర్లు డీలర్లతో మిలాఖత్ అయ్యారన్న విమర్శలున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయోగాత్మకంగా మండలానికి ఒక్కో గ్రామం చొప్పున యంత్రాంగం ఎంపిక చేసింది. ఆ గ్రామ ఎండీయూ వాహనానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి; రాష్ట్ర, జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. జిల్లాలో 38 మండలాలు ఉండగా, 38 గ్రామాలను ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు ఎంపిక చేశారు. వాటి వివరాలను జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయానికి అందజేశారు. డిసెంబర్ 1 నుంచి ఎండీయూ వాహనానికి జీపీఎస్ అనుసంధానించి, సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తారు. ఇది విజయవంతమైతే అంతటా విస్తరించనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపటినట్లు డీఎస్వో శ్యామ్కుమార్ తెలిపారు.
జిల్లాలో చౌకధరల దుకాణాలు 1,392
అన్నపూర్ణ కార్డులు 329
అంత్యోదయ అన్నయోజన 33,117
బియ్యం కార్డులు 6,22,079
ఎండీయూ వాహనాలు 385
ప్రతి నెలా పంపిణీ చేసే బియ్యం 10,393 మెట్రిక్ టన్నులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?