కన్నీటి తడి
యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు పంట పొలాలకు నీటి సౌకర్యం లేక అగచాటు పడుతున్నారు.
ట్యాంకర్లతో పంటను కాపాడుకుంటున్న రైతులు
ట్యాంకర్ నీటిని పొలాల వద్ద ఉన్నకుంటల్లో నింపుతున్న దృశ్యం
త్రిపురాంతకం, న్యూస్టుడే: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు పంట పొలాలకు నీటి సౌకర్యం లేక అగచాటు పడుతున్నారు. ఉన్న బోర్ల నుంచి నీరు రాకపోవడం, కొత్తవి వేసినా ప్రయోజనం లేక త్రిపురాంతకంలోని సాగర్ జలాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి తడుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో భూగర్భజలాలు పడిపోయాయి. బోరుబావులను నమ్ముకుని పంటలు సాగుచేస్తే చివరకు అవీ వట్టిపోయాయి. ప్రస్తుతం సుమారు 15 వేల హెక్టార్లలో మిర్చి వేశారు. ఇది పూత దశలో ఉండటంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంది. నీటి తడి కొద్దిగా ఆలస్యమైనా దెబ్బతినే అవకాశం ఉంది. యర్రగొండపాలెం మండలంలోని ఆమనిగుడిపాడు, బోయలపల్లి, గురిజేపల్లి, గోళ్లవిడిపి, అయ్యంబొట్లవారిపల్లి గ్రామాలతో పాటు.. త్రిపురాంతకం మండలం రామసముద్రం, దువ్వలి గ్రామాల్లో భూగర్భ నీటి వనరులు చాలా తక్కువ. బోరు వేసినా నీరు పడుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో కొందరు రైతులు సుమారు 10కి పైగా లారీ ట్యాంకర్లను బాడుగకు తీసుకున్నారు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ జలాలను తీసుకొచ్చి పొలాల్లో తవ్వి సిద్ధం చేసుకున్న కుంటల్లో నిల్వ చేసుకుంటున్నారు. అనంతరం మిర్చి పంటకు నీరు పెడుతున్నారు. ఇందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుంది. మూడు ట్యాంకర్ల ద్వారా తెచ్చినా ఎకరా పంటకు కూడా సరిపోవడం లేదని తెలిపారు. తాను 15 ఎకరాల్లో మిర్చి వేశానని, అధిక సొమ్ము వెచ్చించి రెండు లారీ ట్యాంకర్లతో నీటిని తీసుకువస్తున్నట్లు ఆమనిగుడిపాడు గ్రామ రైతు జి.వెంకటేశ్వర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?