ఈ-పంట.. సున్నా వడ్డీకి తంటా
కష్టనష్టాలకోర్చి పంటను సాగు చేయడమే తప్ప సాంకేతిక విషయాలపై తగిన అవగాహన లేక రైతులు నష్టపోతున్నారు.
రాయితీ వర్తింపులో చిక్కుముడి
నిబంధనల కొర్రీతో దూరమైపోతున్న రైతులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: కష్టనష్టాలకోర్చి పంటను సాగు చేయడమే తప్ప సాంకేతిక విషయాలపై తగిన అవగాహన లేక రైతులు నష్టపోతున్నారు. కర్షకులకు కొంత ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలుచేస్తుంది. 2020 రబీ సీజన్, 2021 ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించినవారికి ఇది వర్తిస్తుంది. అర్హులైన రైతుల జాబితాను గత రెండు వారాలుగా జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఉంచారు. అభ్యంతరాలుంటే రైతులు మరోవిడత అర్జీ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. ఎంపికైనవారికి ఈ నెల 29న వడ్డీ రాయితీ నిధులు వారి బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయి. అయితే సున్నా వడ్డీ పంట రుణాలకు ఈ-పంట నమోదు తప్పనిసరి. దాంతోపాటు రెండు చోట్ల రుణం తీసుకున్నా ఒక్కదానికే వర్తింపజేశారు. ఇలాంటి వడపోత కారణంగా సగం మంది లబ్ధికి దూరమయ్యారు.
వడ్డీ రాయితీ ఎలా ఇస్తారంటే..
పంట రుణాలపై వాస్తవ వడ్డీ 11 శాతం. బ్యాంకులు రెండు శాతం తగ్గించుకుని 9 శాతానికి ఇస్తున్నాయి. రుణం ఇచ్చే సమయంలోనే కేంద్ర ప్రభుత్వం రెండు శాతం రాయితీ ఇస్తోంది. ఏడాదిలోపు చెల్లిస్తే మరో మూడు శాతాన్ని ప్రోత్సహకంగా అందజేస్తోంది. మిగిలిన నాలుగు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద భరిస్తోంది. ఏడాదిలోగా రుణాన్ని చెల్లించకుంటే ఆ రైతు 7 శాతం చొప్పున వడ్డీ భరించాల్సి ఉంటుంది.
పూర్తి అవగాహన లేక
వ్యవసాయ రుణాలు మంజూరు లేదా రుణాన్ని పునరుద్ధరించే సమయంలో .. ఏ పంట కోసమనేది రైతులను బ్యాంకర్లు అడగడం లేదు. తమకు కావాల్సిన 1బి, అడంగల్ ప్రతులను తెప్పించుకుని దరఖాస్తు నమూనా నింపి పక్కన పెడుతున్నారు. ‘బిజీగా ఉన్నాం, రేపు రుణ మొత్తాన్ని మీ పొదుపు ఖాతాలో జమ చేస్తాం..డ్రా చేసుకోండి’ అంటూ పలు శాఖల్లో సూచిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో స్థానికంగా సాగు చేసే ఏదో ఒక పంటను ఆ రైతు పేరు మీద నింపేస్తున్నారు. ఇక్కడే తేడా వస్తుంది. వ్యవసాయశాఖ పరంగా సున్నా వడ్డీ కావాలన్నా.. పంటకు బీమా వర్తించాలన్నా.. ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా విక్రయించాలన్నా ఈ-పంట కొలమానం. ఆ సమయంలో ఒక రకం పైరు సాగు చేసినట్లు ఉంటే; బ్యాంకు రుణం ఇచ్చిన సమయంలో మరో రకం చేసినట్లు నమోదు కనిపిస్తుంది. ఇలా వేర్వేరు కావడంతో ఈ-పంటలో ఉన్నవారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రాయితీ ఇస్తున్నారు. మరికొందరు రైతులు అవగాహన లేక ఈ-పంట నమోదు చేసుకోలేదు. అటువంటివారు రుణం సకాలంలో చెల్లించినా సున్నా వడ్డీ రాయితీకి అనర్హులయ్యారు. మరి కొందరు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు, సొసైటీల్లోనూ రుణం తీసుకున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా ఒక రుణానికే వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. 2020 రబీ సీజన్, 2021 ఖరీఫ్ సీజన్లో 57,410 మంది రుణాన్ని తిరిగి చెల్లించగా, అందులో ఇప్పటివరకు 29,804 మందిని మాత్రమే సున్నా వడ్డీకి అర్హులయ్యారు. మిగతా 27,606 మంది పథకానికి దూరమయ్యారు. నిబంధనలు లేకుండా సకాలంలో చెల్లించిన అందరికీ వడ్డీ రాయితీ విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు