సర్వజనలో కీలక సేవలు
జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ఎట్టకేలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని వైద్యం అందించాలని నిర్ణయించారు
ఆరు విభాగాల్లో నిపుణుల నియామకం
ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన వారు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ఎట్టకేలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని వైద్యం అందించాలని నిర్ణయించారు. మొత్తం 8 విభాగాలకు వైద్యులను నియమించాలని కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్ నాయక్ వైద్య విద్య సంచాలకుని కోరగా ఆ మేరకు అంగీకరించి ఇటీవల ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం ఆరుగురు వైద్యులు బాధ్యతలు తీసుకున్నారు. దాంతో వారు చూసే ఓపీ, ఆసుపత్రిలో చేరే రోగులకు సేవలందించే సమయాలను నిర్దేశించారు. అవసరమైన మందులు కేంద్రీయ ఔషధ కేంద్రంలో అందుబాటులో లేకపోతే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్డీఎస్) నిధులతో కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు వైద్యులు లేక వినియోగించని వ్యాధి నిర్ధరణ పరికరాలకు మోక్షం కలగనుంది. సూపర్ స్పెషాలిటీ ఓపీ ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని సూపరింటెండెంట్తో పాటు ఆర్ఎంవో డాక్టర్ చైతన్య తెలిపారు.
అందుబాటులోకి వచ్చిన సేవలు పరిశీలిస్తే..
ప్రతి సోమ, గురువారాల్లో సర్జికల్ ఓపీ మూడో నంబరులో న్యూరాలజిస్టు అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. మంగళ, శుక్రవారాల్లో ప్లాస్టిక్ సర్జన్ సేవలందిస్తారు. ప్రతి సోమ, శుక్రవారాల్లో మూడో నంబరు ఓపీ విభాగంలో యూరాలజిస్టు ఉంటారు మంగళ, శుక్రవారాల్లో మూడోనంబరు ఓపీలో పీడియాట్రిక్ సర్జన్ .. పదోనంబరు ఓపీలో కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉంటారు. బుధ, శుక్రవారాల్లో పదోనంబరు ఓపీలో నెఫ్రాలజిస్ట్ సేవలుంటాయి.
ఆ రెండు విభాగాల్లోనూ భర్తీ అయితే..
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, న్యూరోఫిజీషియన్ వైద్యుల పోస్టులు ఇంతవరకు భర్తీకాలేదు. రోజువారీ వచ్చే రోగుల్లో ఈ తరహా సమస్యలతో ఉన్నవారు అధికమే. గ్యాస్ట్రోస్కోపీ యంత్రం అందుబాటులో ఉన్నా వైద్యుడు, సాంకేతిక సిబ్బంది లేక నిరుపయోగంగా మారింది. డాక్టర్ భగవాన్ నాయక్ మాట్లాడుతూ అన్ని స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతమున్న నిపుణులు ఉదయం ఓపీ చూశాక, సాయంత్రం ఆసుపత్రిలో రోగుల పరిశీలన.. శస్త్ర చికిత్సలకు హాజరవుతారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?