పాల ఉత్పత్తి పెంపు... పశు పోషకులకు లబ్ధి
పాల ఉత్పత్తి పెంచడంతో పాటు, పశు పోషకులకు లాభసాటిగా ఉండేలా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ... రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో ‘పెయ్యి దూడల ఉత్పత్తి పథకం’ అమలుకు రంగం సిద్ధం చేసింది
ప్రయోగాత్మకంగా 12 మండలాల్లో పెయ్యి దూడల పథకం అమలు
న్యూస్టుడే - ఒంగోలు గ్రామీణం
పాల ఉత్పత్తి పెంచడంతో పాటు, పశు పోషకులకు లాభసాటిగా ఉండేలా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ... రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో ‘పెయ్యి దూడల ఉత్పత్తి పథకం’ అమలుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం కృత్రిమ గర్బధారణ పద్ధతిలో పుట్టే పెయ్యి దూడల శాతం సగానికి పైగా తగ్గింది. దీంతో పశుపోషణే జీవనాధారమైన పాడి రైతులకు కొంతమేర ఇబ్బంది తలెత్తుతోంది. మరోవైపు క్రమేణా పాల దిగుబడి తగ్గడంతో డెయిరీల నిర్వాహకులకూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశగా లింగ నిర్ధారిత వీర్యం అందించేందుకు పశుసంవర్థకశాఖ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ముందస్తు ఒప్పందం మేరకు...
పెయ్యి దూడల పథకం కింద ఒక్కో రైతుకు రూ.675 చొప్పున ధర కలిగిన లింగ నిర్ధారిత వీర్యాన్ని రెండు పర్యాయాలు సమకూర్చుతారు. మొత్తం విలువ రూ.1,350 కాగా... రూ.850 రాయితీ ఉంటుంది. ఆ మేరకు రైతులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఆసక్తి గల పాడి రైతులు ముందస్తు ఒప్పందం చేసుకుని నగదు చెల్లించాలి. ఒకవేళ రెండు పర్యాయాలు వీర్య నాళికలు ఉపయోగించినా పశువు గర్భం దాల్చకపోతే రైతు చెల్లించిన మొత్తం తిరిగి ఇచ్చేస్తారు. మొదటి సారి వినియోగించిన వీర్య నాళిక ద్వారా గర్భం దాల్చిన పశువుకు మగదూడ పుట్టినట్లయితే డబ్బులు తిరిగి చెల్లించరు. కొన్ని పశువులు 21 రోజుల తర్వాత ఎదకు వస్తాయి. దాంతో రెండో సారి వాడిన వీర్య నాళిక ద్వారా కూడా మగదూడ పుడితే రూ.250 తిరిగి ఇవ్వనున్నారు. ఎదకురాని పక్షంలో 90 రోజులకు చూడి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. చూడి కాకుంటే రూ.500 తిరిగి ఇస్తారు.
* పథకం లక్ష్యం: ఎదకు వచ్చిన పాడి గేదెలకు లింగ నిర్ధారిత వీర్యం ఇచ్చి 90 శాతం మేలు జాతి పెయ్యి దూడలు ఉత్పత్తి చేయడం. తద్వారా పాల దిగుబడి... పోషకుల ఆదాయం పెంచాలన్నది లక్ష్యం.
* తొలి విడతగా అమలు చేయనున్న మండలాలు: దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, కొండపి, పొన్నలూరు, సింగరాయకొండ.
* ఏం చేస్తారు: ఆయా మండలాల్లోని గ్రామాల్లో మేలైన పశు సంపద, ఔత్సాహిక పశు పోషకులను గుర్తిస్తారు. సంపూర్ణ ఆరోగ్యం కలిగి, క్రమం తప్పకుండా ఎదకు వచ్చే కనీసం 40 పశువులను గుర్తిస్తారు. వాటి పోషకులతో ముందస్తు ఒప్పందాలు చేసుకుని లింగ నిర్ధారిత వీర్యంతో పశువులకు చూలు కట్టిస్తారు. మొత్తంగా 2,570 గేదెలకు వీర్యం ఇవ్వాలన్నది లక్ష్యం.
అన్ని మండలాలకూ విస్తరిస్తాం...
పాల ఉత్పత్తి పెంపుదలలో భాగంగా పెయ్యి దూడల పథకంపై గ్రామాల్లోని పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో తొలివిడతగా 12 మండలాలను ఎంపిక చేశాం. ఆసక్తి కలిగిన పశుపోషకులు సమీప పశు వైద్యశాలల్లో సంప్రదించాలి. రెండో విడతలో జిల్లాలోని మిగిలిన మండలాలకు పథకాన్ని విస్తరిస్తాం.
కాలేషా, ఈవో, జిల్లా పశుగణాభివృద్ధి సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?