అంతా ఇష్టారాజ్యం!
గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆనుకుని కొందరు అడ్డగోలుగా చేపల చెరువులు సాగు చేస్తున్నారు.
గుండ్లకమ్మను ఆనుకుని చేపల చెరువుల ఏర్పాటు
నిబంధనలకు విరుద్ధంగా జలాశయంలోనూ వేట
న్యూస్టుడే - మద్దిపాడు
జలాశయాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన చేపల చెరువులు
గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆనుకుని కొందరు అడ్డగోలుగా చేపల చెరువులు సాగు చేస్తున్నారు. ఈ పేరిట బయట ప్రాంతాల మత్స్యకారులను రప్పించి... జలాశయంలోనూ అనధికారికంగా వేట చేయిస్తున్నారు. స్థానిక మత్స్యకారుల ఉపాధికి గండి కొడుతున్నారు. గతంలోనూ ఇదే తరహా వ్యవహారంలో వివాదాలు తలెత్తడంతో అధికారులు చొరవ చూపి పరిష్కరించారు. ప్రస్తుతం... వ్యాపారుల వైఖరితో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
నిబంధనల ప్రకారం గుండ్లకమ్మ జలాశయాన్ని ఆనుకుని చేపల చెరువులు తవ్వరాదు. కానీ కొందరు వ్యక్తులు అడ్డగోలుగా చెరువులు తవ్వించి చేపల పెంపకం చేపడుతున్నారు. బయటకు మామూలు చేపలని చెబుతున్నా... చాలా వరకు నిషేధిత క్యాట్ ఫిష్నే పెంచుతున్నారు. మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలను వీటికి మేతగా వేస్తున్నారు. దీంతో ఆ పరిసరాలు కలుషితమవుతున్నాయి. చెరువులకు అవసరమైన నీటిని సైతం గుండ్లకమ్మ నుంచే పెడుతున్నారు. అంతా బాహాటంగానే సాగుతున్నా... ఈ అనధికారిక వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువుల నిర్వహణకు వాటి యజమానులు... కృష్ణ, పశ్చిమ గోదావరి, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులను రప్పిస్తున్నారు. వారందరికీ ఇక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్వారా జలాశయంలోని చేపలనూ పట్టిస్తున్నారు. దీంతో గుండ్లకమ్మపైనే ఆధారపడిన లైసెన్స్డ్ మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది.
సమస్య మళ్లీ మొదటికి...
గుండ్లకమ్మ ప్రాజెక్టు ద్వారా ఈ పరిసరాల్లోని దాదాపు నాలుగు వేల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. జలాశయంలో వీరు మాత్రమే చేపల వేట సాగించేలా ప్రత్యేకంగా లైసెన్స్లను సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. మత్స్య సంపదకు కొరత లేకుండా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏటా చేప పిల్లలను సైతం విడిచిపెడతారు. బయటివారెవరూ ఇక్కడ వేట సాగించడానికి వీల్లేదు. కానీ, కొందరు వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి మత్స్యకారులను రప్పించి... వారి ద్వారా అనధికారికంగా వేట సాగించేవారు. ఈ క్రమంలో తరచూ వివాదాలు తలెత్తడంతో... మత్స్యశాఖ అధికారులు పక్కాగా తనిఖీలు చేపట్టి బయటి ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. ఆ సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో... చేపల చెరువుల పేరిట మళ్లీ బయటి వారిని రప్పించారు. పాత పునరావాస గ్రామాల్లో వారికి ఆవాసం కల్పించి... అనధికార వేట చేయిస్తున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
కాపలాదారుల కోసం వేసిన పాకలు
* జలాశయంలో పెద్ద చేపలను మాత్రమే పట్టాలి. మత్స్యసంపద వృద్ధి దృష్ట్యా పిల్లలను పట్టరాదు. ఇందుకు అనుగుణంగానే వలలు వినియోగించాల్సి ఉంటుంది. కానీ... బయటి నుంచి వచ్చిన మత్స్యకారులు చిన్న కన్నులు కలిగిన వలలను వినియోగిస్తూ పిల్లలను సైతం పడుతున్నారు. వీటిని అనధికారిక చెరువుల్లో పెంచుతున్న క్యాట్ఫిష్కు ఆహారంగా అందిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని... నీరంతా బయటకు పోయి మత్స్యసంపద పూర్తిగా తగ్గిపోయింది. ఉన్న కొద్ది పాటి చేపలనూ బయటవారు తీసుకుపోతుండడంతో... స్థానిక మత్స్యకారులకు తీరని నష్టం వాటిల్లుతోంది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం...
జలాశయాన్ని ఆనుకుని అనధికారికంగా చేపలు చెరువులు సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గుండ్లకమ్మలోనూ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వేట సాగించాలి. ఆ ప్రాంతాన్ని పరిశీలించి బయటివారు ఉంటే ఖాళీ చేయిస్తాం.
చంద్రశేఖర్, మత్స్యశాఖ జేడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి