‘సీఎం సభలో బుర్కాల తొలగింపు దారుణం’
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న నరసాపురం బహిరంగ సభకు హాజరైన ముస్లిం మహిళల బుర్కాలను తొలగించడం దారుణమని తెదేపా మైనార్టీ విభాగం ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ రసూల్ మహమ్మద్ విమర్శించారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న తెదేపా మైనార్టీ విభాగం నాయకులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న నరసాపురం బహిరంగ సభకు హాజరైన ముస్లిం మహిళల బుర్కాలను తొలగించడం దారుణమని తెదేపా మైనార్టీ విభాగం ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ రసూల్ మహమ్మద్ విమర్శించారు. ఈ మేరకు తెదేపా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రసూల్ మాట్లాడుతూ.. బహిరంగ సభకు ముస్లిం మహిళలు తమ బుర్కాలు, ఇతరుల నల్ల చున్నీలు తొలగించి రావాల్సిందిగా ఆదేశించి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మహిళలను అగౌరవ పరచడం తగదన్నారు. రాష్ట్ర మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు కపిల్బాషా మాట్లాడుతూ.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత రుణాల మంజూరు చేయడంతో పాటు, ఇస్లామీ బ్యాంక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రంజాన్ తోఫాను పునరుద్ధరించడంతో పాటు, ఇమాం మౌజన్లందరికి గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. ధర్నాలో తెదేపా నాయకులు షేక్ అన్వర్బాషా, ఆరీఫా, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్