logo

ఒక్క పోస్టుకు 313 మంది

నల్లమలలోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న ఎకోటూరిజంలో ఒప్పంద పద్ధతిలో సహాయ సూపర్‌వైజర్‌ నియామకానికి అటవీశాఖ సోమవారం పరీక్ష నిర్వహించింది.

Published : 29 Nov 2022 02:17 IST

పరీక్ష రాస్తున్న విద్యార్థులు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే : నల్లమలలోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న ఎకోటూరిజంలో ఒప్పంద పద్ధతిలో సహాయ సూపర్‌వైజర్‌ నియామకానికి అటవీశాఖ సోమవారం పరీక్ష నిర్వహించింది. ఈ పోస్టుకు 453 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా వారిలో 313 మంది పరీక్షకు హాజరయ్యారు. దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు పర్యవేక్షణలో అటవీ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాసిన వారిలో అత్యధిక మార్కులు సాధించిన 30 మందికి రేంజర్‌ విశ్వేశ్వరరావు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మహాలక్ష్మమ్మ, జిల్లా ఎన్‌జీసీ కోఆర్డినేటర్‌ సజీవరాజులు ముఖాముఖి నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని