శ్రమజీవులకు వేతనమేదీ!
ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నవారికి ప్రోత్సాహకాలే కాదు సకాలంలో ఇవ్వాల్సిన వేతనాలకూ హామీ లేకుండా పోతుంది.
మూడు నెలలుగా నిలిచిన చెల్లింపులు
జిల్లాలో రూ.11 కోట్ల బకాయిలు
వాగులో పూడికతీత పనులు చేస్తున్న ఉపాధి కూలీలు
ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నవారికి ప్రోత్సాహకాలే కాదు సకాలంలో ఇవ్వాల్సిన వేతనాలకూ హామీ లేకుండా పోతుంది. ఈ ఏడాది వేసవి భత్యాన్ని నిలిపేశారు. తద్వారా కొంత మేర కూలి తగ్గింది. మరోవైపు రెండు పూటలా పని చేయిస్తున్నారు. అయినా చేసిన పనికి సంబంధించి సెప్టెంబరు 3వ తేదీ నుంచి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. గ్రామాల్లో ఇప్పటికే రబీ సీజన్ ప్రారంభం కావడంతో ఎక్కువ మంది వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. దీంతో కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: వారం పాటు ఉపాధిపనులకు వెళ్లిన కూలీల వివరాలతోపాటు, వారు చేసిన పనిని బట్టి తర్వాతి వారంలో బుధవారం లోపు మండల కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు అంతర్జాలంలో నమోదు చేస్తారు. వెంటనే కూలీల బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ అవుతాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉపాధి పనులకు వెళ్తారు. గత మూడు నెలలుగా సుమారు లక్ష మందికి రూ.11 కోట్ల మేర వేతన బకాయిలు నిలిచిపోయాయి. ఇప్పటికే 12 వారాలు పూర్తి కావడంతో డబ్బులు ఎప్పుడు చేతికి అందుతాయా అని ఎదురు చూస్తున్నారు.
ఇతర పనులు చూసుకుంటూ..
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం వల్ల వలసలు వెళ్లేవారి సంఖ్య కొంత మేర తగ్గింది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రకాశం జిల్లాలోని వ్యవసాయ కూలీలకు స్థానికంగానే పని దొరికేది. మే నెలలో అత్యధికంగా సుమారు 2.50 లక్షల మంది కూలీలు ఈ పనులకు హాజరయ్యారు. అదే స్థాయిలో జూన్, జులై నెలలోనూ చేశారు. జనవరి నెలాఖరు నుంచే వ్యవసాయ సీజన్ మందగించనున్న నేపథ్యంలో ఆ తర్వాత ఉపాధి పనులకు మరింత డిమాండ్ వస్తోంది. ఏ రంగంలో పనికి వెళ్లినా కూలీలకు వారం చివర్లో డబ్బులు ఇస్తారు. అదే ఉపాధి పనులకు వెళ్తే మాత్రం సకాలంలో ఇవ్వకపోవడం, అదీ తక్కువగానే రావడం కారణంగా ఎక్కువ శాతం ప్రత్యామ్నాయంగా ఇతర పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం 11,800 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. మరో రెండు నెలల్లో పనులు ముమ్మరంగా జరగనున్నాయి. కూలీల సంఖ్య తగ్గితే ఆ ప్రభావం గ్రామాల్లోని మెటీరియల్ కాంపొనెంట్ నిధుల పనులపై పడుతుంది. వారికి వేతనాల చెల్లింపు ఆధారంగా 60:40 కింద మెటీరియల్ కాంపొనెంట్ నిధులు వస్తాయి. వాటి లభ్యతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ అనుసంధానం కింద గ్రామాల్లో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ, ఆరోగ్య క్లినిక్ల నిర్మాణ పనులు చేపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ