నాలుగు విడతల్లో రూ.144.25 కోట్ల లబ్ధి
జగనన్న విద్యాదీవెన కింద నాలుగు విడతల్లో జిల్లాకు చెందిన సుమారు 55 వేల మంది విద్యార్థులకు రూ.144.25 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
విద్యాదీవెన చెక్కు అందజేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్
దినేష్కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ
పోతుల సునీత తదితరులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: జగనన్న విద్యాదీవెన కింద నాలుగు విడతల్లో జిల్లాకు చెందిన సుమారు 55 వేల మంది విద్యార్థులకు రూ.144.25 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రకాశం భవన్లో బుధవారం ‘జగనన్న విద్యాదీవెన’ నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయి లేకుండా ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. వసతి దీవెన కింద మరో రూ.109 కోట్ల్లకు పైగా ప్రయోజనం కలిగించినట్లు తెలిపారు. అమ్మఒడి, విద్యాకానుక, పాఠశాలల్లో నాడు-నేడు, మధ్యాహ్న భోజనం తదితర పథకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ఆర్థికసాయాన్ని సమర్థÄంగా వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, మేయర్ గంగాడ సుజాత, జిల్లా సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు లక్ష్మానాయక్, జగన్నాథరావు, అంజల, ఝాన్సీరాణి.. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ జి.అర్చన పాల్గొన్నారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం కింద జిల్లాలోని 55,646 మంది విద్యార్థులకు
రూ.34.97 కోట్ల చెక్కు అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
TS Assembly: బడ్జెట్ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి
-
Latestnews News
Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్కు వీడ్కోలు
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!