భగ్గుమన్న ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల సమస్యలపై బుధవారం విజయవాడలో ధర్నా చేయడానికి వెళ్లిన వారిని అరెస్టులు చేసి, కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు.
అక్రమ అరెస్టులను నిరసిస్తూ దీక్షలు
కలెక్టరేట్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిస్తున్న యూటీఎఫ్ నేతలు
ఒంగోలు నగరం, ఒంగోలు గ్రామీణం, కనిగిరి, న్యూస్టుడే: ఉపాధ్యాయుల సమస్యలపై బుధవారం విజయవాడలో ధర్నా చేయడానికి వెళ్లిన వారిని అరెస్టులు చేసి, కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా కోశాధికారి కె.లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ డి.వీరాంజనేయులు నేతృత్వంలో కలెక్టరేట్ వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వచ్చారు. సాయంత్రం 6.30 నుంచి కలెక్టరేట్ ఎదుట జాగరణ దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే నియంతృత్వ చర్యలను ఖండించారు. ప్రభుత్వ అణచివేత ధోరణికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన చేపట్టామన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల పీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీఇంబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు దీర్ఘకాలంగా ఇవ్వలేదన్నారు. ఉద్యోగులు దాచుకున్న పొదుపు మొత్తాలను అవసరాలకోసం ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేస్తున్నారన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడలో ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించి ఈ రోజు అడ్డుకోవడం హేయమైన చర్యన్నారు. సంఘ నాయకులు వై.వెంకట్రావు, కె.ఆదినారాయణ, జి.శేషయ్య, కె.హనుమంతరావు, హరిబాబు, ప్రసాద్, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కనిగిరి పీవీఆర్ పార్కు ఎదుట బుధవారం రాత్రి నిరసన
జాగరణ చేస్తున్నయూటీఎఫ్ నాయకులు
కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో యూటీఎఫ్ నాయకుల గృహాలకు మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వెళ్లారు. విజయవాడకు వెళ్లకూడదని, ధర్నాలో పాల్గొనకూడదని నోటీసులిచ్చి దాదాపు 120 మందిని గృహ నిర్బంధం చేశారు. సీఎస్పురం నుంచి విజయవాడ ధర్నాకు వెళ్లిన పలువురు యూటీఎఫ్ ప్రతినిధులను అక్కడి పోలీసులు అరెస్టుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..