నిండా ముంచేశారు!
‘‘ఒకటికి పదిరెట్లిస్తాం.. స్థలాలు కొనిస్తాం.. మొక్కలు పెంచి ఇస్తాం... మీకు తెలిసిన వారిని చేర్పిస్తే కమిషన్ ఇస్తాం..’’ అంటూ ప్రకటనలతో ఆశలు రేకెత్తించి వందలాదిమందిని మోసగించింది ‘సంకల్ప సిద్ధిమార్ట్’ సంస్థ.
ఆవేదనలో ‘సంకల్ప సిద్ధిమార్ట్’ బాధితులు
కొనుగోలు చేసినట్లు చూపుతున్న స్థలంలో ఎర్రచందనం మొక్కలు
కనిగిరి, న్యూస్టుడే: ‘‘ఒకటికి పదిరెట్లిస్తాం.. స్థలాలు కొనిస్తాం.. మొక్కలు పెంచి ఇస్తాం... మీకు తెలిసిన వారిని చేర్పిస్తే కమిషన్ ఇస్తాం..’’ అంటూ ప్రకటనలతో ఆశలు రేకెత్తించి వందలాదిమందిని మోసగించింది ‘సంకల్ప సిద్ధిమార్ట్’ సంస్థ. దీని బాధితులు ఒకరొకరుగా ముందుకొచ్చి తమ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ మోసాలు అక్కడ తీగ లాగితే కనిగిరిలో బయటపడిన విషయం తెలిసిందే. నిర్వాహకులు యాప్ ద్వారా గొలుసుకట్టు వ్యాపారం చేపట్టారు. ఇందులో చేరినవారు కట్టిన నగదుకు భరోసాగా కనిగిరి ప్రాంతంలో 150 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో మొక్కలు నాటి 15 ఏళ్ల తర్వాత విక్రయించేలా.. వచ్చిన ఆదాయంలో చెరిసగం అన్నట్లుగా ఒప్పంద పత్రాలు రాయించారు. తమ మోసపు వ్యాపారానికి అనుకూలంగా కనిగిరి, పామూరు, పీసీపల్లి, పామూరు, సీఎస్పురం తదితర ప్రాంతాల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. రూ.10 వేలు కడితే రోజుకు రూ.100.. రూ.50 వేలు కడితే రూ.500, రూ.3 లక్షలు చెల్లిస్తే రూ.3 వేలు.. అలా 100 రోజుల్లో అసలు మొత్తం వచ్చేస్తుందంటూ ప్రకటనలిచ్చారు. మొదట కట్టినవారికి రోజూ నగదు జమ అవుతుండటంతో ఆశతో వ్యాపారులు, రైతులు, కూలీలు, ఆటోచోదకులు సుమారు 300 మందికిపై ఈ ప్రాంతాల్లో చెల్లించారు. రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు కట్టిన వారు ఉన్నారు. నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. పైగా కనిగిరి ప్రాంతంలో కొందరు నాయకులు ఈ మోసంలో సూత్రధారులుగా ఉన్నారని బాధితులు తెలిపారు. కట్టిన డబ్బుకు ఢోకా లేదని.. పైగా మార్ట్ యాజమాన్యం రోజూ కమిషన్ ఇస్తుందని.. మీ పేరిట స్థలం, మొక్కలతో రిజిస్ట్రేషన్ చేయిస్తారని చెప్పి నమ్మించారని వాపోయారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని బుధవారం కనిగిరిలో బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు.
కనిగిరిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంకల్ప సిద్ధిమార్ట్ బాధితులు
* కనిగిరికి చెందిన దాసరి మల్లికార్జున స్థానికంగా శుభకార్యాలకు సామగ్రి సరఫరా చేసే దుకాణం నిర్వహిస్తున్నారు. రూ.10 పెట్టుబడి పెడితే వంద వస్తుందని కొందరు ఆశ కల్పించడంతో రూ.56 వేలను ‘సంకల్ప సిద్ధి మార్ట్’కు కట్టారు. రోజుకు రూ.560 జమ అవుతూ వచ్చాయి. కొద్ది రోజుల తర్వాత యాప్ అదృశ్యమైంది. తన డబ్బుల సంగతేమిటో అర్థం కావడంలేదని ఆయన ఆవేదన చెందారు.
* కొత్తపేటకు చెందిన రైతు సైకం శివారెడ్డిని తెలిసినవారు సంకల్ప యాప్లో చేరమని చెబితే చేరారు. రూ.3 లక్షల వరకు డిపాజిట్ చేశారు. రెండు మూడు నెలలు కమిషన్ వచ్చింది. యాప్లో ఆయన చెల్లించిన నగదునూ చూపించారు. ఆ తర్వాత బోర్డు తిప్పేయడంతో శివారెడ్డి లబోదిబోమంటున్నారు.
* కనిగిరి పాతూరు ప్రాంతానికి చెందిన యువకుడు యు.నవీన్కుమార్.. మిత్రుడి సూచనతో రూ.10 వేలు ‘సంకల్ప సిద్ధిమార్ట్’కు కట్టాడు. కుటుంబ సభ్యులనూ చేర్పించాడు. ఇప్పుడు తామంతా మోసపోయామని మదన పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM