పురంలో అధికార గొలుసు దుకాణం
మార్కాపురం పట్టణ కేంద్రంలో అధికార గొలుసు దుకాణం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల వరకు ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహించిన ప్రాంతంలో అది ఉండటం గమనార్హం.
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
చోద్యం చూస్తున్న సెబ్ అధికారులు
కంభం రహదారిలోని గొలుసు దుకాణంలో మద్యం విక్రయిస్తున్న దృశ్యం
మార్కాపురం నేర విభాగం న్యూస్టుడే: మార్కాపురం పట్టణ కేంద్రంలో అధికార గొలుసు దుకాణం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల వరకు ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహించిన ప్రాంతంలో అది ఉండటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులకు స్థానిక బార్ల యజమానుల నుంచి ముడుపులు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో మొత్తం నాలుగు ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వాటిలో గడియార స్తంభం కూడలిలోని దుకాణానికి ఎదురుగా ఓ ప్రధాన ప్రార్థనా మందిరం ఉండటంతో అధికారులు దాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని నిర్ణయించారు. దీంతో పాటు కంభం రహదారిలోని మరో దుకాణానికి సంబంధించిన భవనం లీజు గడువు పూర్తయింది. మళ్లీ పునరుద్ధరించేందుకు వీలు లేకుండా యజమానితో కూతవేటు దూరంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంటు యజమాని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఇక్కడి దుకాణాన్ని పూల సుబ్బయ్య కాలనీకి, గడియార స్తంభం కూడలిలో ఉన్న దుకాణాన్ని డ్రైవర్స్ కాలనీకి మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీన రెండు దుకాణాల్లోని మొత్తం సరకును నూతన భవనాల్లోకి తరలించారు. అయితే కంభం రహదారిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం స్థానంలో మాత్రం వ్యాపారం నిర్వహిస్తూనే ఉన్నారు. అదీ బార్ అండ్ రెస్టారెంట్లలో విక్రయించే ధరలకు అదనంగా రూ.50-100 తీసుకొని యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నారు. కంభం రహదారిలో ఉన్న రెస్టారెంట్కు ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గరగా ఉండటంతో పథకం ప్రకారం ఖాళీ చేయించిన యజమాని అది ఖాళీ అయిన వెంటనే ఆగమేఘాలపై కొంత సరకును అక్కడికి తరలించి అనధికారిక గొలుసు దుకాణం నిర్వహిస్తుండటం కొసమెరుపు. కళ్లముందు ప్రధాన రహదారిపై లక్షల రూపాయల వ్యాపారం అనధికారికంగా సాగుతున్న నియంత్రించాల్సిన సెబ్ అధికారులు చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మరో వైపు పట్టణంలో కొత్త ప్రాంతాలకు తరలించక ముందు రోజుకు ఒక్కో దుకాణంలో రూ.3 లక్షల నుంచి 4 లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరగా నూతన దుకాణాల్లో కనీసం లక్షకు మించక పోవడం శోచనీయం. అయితే ఈ రెండు దుకాణాలు తరలి పోవడంతో రెస్టారెంట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణంలో మొత్తం అయిదు బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా అవన్నీ కూడా అధికార పార్టీ నాయకులకు చెందినవి కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!