దిల్లీలో ఏం జరుగుతోంది..!
‘అమిత్ అరోడా ఎవరో నాకు తెలియదు.. ఎప్పుడూ కలవలేదు. దిల్లీ మద్యం వ్యాపారంలో మా పాత్ర లేదు. మా కుటుంబంలో ఎవరూ అందులో లేరు.
తాజా పరిణామాలపై మాగుంట స్పందన
జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ‘అమిత్ అరోడా ఎవరో నాకు తెలియదు.. ఎప్పుడూ కలవలేదు. దిల్లీ మద్యం వ్యాపారంలో మా పాత్ర లేదు. మా కుటుంబంలో ఎవరూ అందులో లేరు. దక్షిణాది వ్యాపారులపై ఉత్తరాదివారు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతోంది.’
దిల్లీ లిక్కర్ స్కామ్లో ఛార్జిషీటులో తన పేరు ఉందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పందన ఇది. ఈ స్కామ్ దేశవ్యాప్తంగా గత నాలుగైదు నెలలుగా ప్రకంపనలు సృష్టిసోంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈడీ దర్యాప్తు మొదలైన తర్వాత చెన్నై, నెల్లూరులో మాగుంట కార్యాలయాలు, నివాసాల్లో కూడా బృందాలు తనిఖీలు చేపట్టాయి..ఈ తరుణంలో ఎంపీ తొలిసారిగా సెప్టెంబర్ 19న ఒంగోలులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తనకు, తన కుమారుడు రాఘవరెడ్డికి దిల్లీ మద్యం వ్యాపారంతో ఎటువంటి సంబంధమూ లేదని నాడు స్పష్టం చేశారు. తమది మొదటి నుంచి మద్యం వ్యాపారంలో ఉన్న కుటుంబం కావడంతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపడేశారు. పథకం ప్రకారం కుట్రలు చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఈడీ అధికారులు తమ కార్యాలయాలు, నివాసాల్లో నిర్వహించిన తనిఖీల్లో కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు అవాస్తవమని.. తమ వద్ద ఎటువంటి పత్రాలు తీసుకోలేదని పంచనామాలో పేర్కొన్నారని చెప్పారు. అదే సమయంలో రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి తన స్థానంలో కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీచేస్తారని కూడా ప్రకటించారు. మాగుంట సుదీర్ఘ వివరణతో ఈ వ్యవహారం కొంతకాలం సద్దుమణిగినట్లు కనిపించింది.
మరోవిడత రంగంలోకి దిగి..
తొలివిడతలో కేవలం తనిఖీలకే పరిమితమైన ఈడీ మలివిడతలో లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న పలువురిని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డిని తన కార్యాలయానికి పిలిపించుకుని విచారించడం కలకలం రేపింది. ఇటీవల రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసు దర్యాప్తు మరింత ఊపందుకుంది. స్కామ్లో కీలకపాత్ర పోషించిన అమిత్ అరోడాను అరెస్టు చేసి ప్రశ్నించిన ఈడీ అతనిచ్చిన వాంగ్మూలంలో భాగంగా ఎంపీ పేరును ప్రస్తావించడం తాజాగా చర్చనీయాంశమైంది. దక్షిణాది వ్యాపారులు ఉత్తరాది వైపు విస్తరించకుండా ఒక కుట్ర జరుగుతోందని, దానిలో భాగంగానే తమపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని ఎంపీ మాగుంట వాదన. తమ బృందం అన్ని అంశాలు పరిశీలిస్తుందని.. త్వరలో ఒంగోలులో తాను అన్ని వివరాలు వెల్లడిస్తానని ఎంపీ గురువారం పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే