విద్యుదాఘాతంతో రైతు మృతి
వరి చేలో ఎరువు చల్లి నీరు పెట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందారు.
చీమకుర్తి, న్యూస్టుడే: వరి చేలో ఎరువు చల్లి నీరు పెట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందారు. ఈ విషాద సంఘటన చీమకుర్తి మండలం మైలవరంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై వి.ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం గ్రామానికి చెందిన మద్దారపు వెంకట్రావు(45) అనే రైతు పొలంలో వరి సాగు చేశారు. చేనుకు యూరియా చల్లేందుకు సాయంత్రం సమయంలో పొలం వద్దకు వెళ్లారు. అనంతరం నీరు పెట్టేందుకు బోరు వేస్తున్న సమయంలో ఆధారం కోసం విద్యుత్తు స్తంభానికి ఏర్పాటు చేసిన తీగను తాకారు. దీంతో విద్యుదాఘాతానికి గురై వెంకట్రావు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. విషయాన్ని గుర్తించిన పరిసర ప్రాంత రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంట పొలంలో విగతజీవిగా పడి ఉన్న వెంకట్రావును చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన కుమారుడు మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొని..
కొమరోలు గ్రామీణం, న్యూస్టుడే : ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తాటిచెర్ల మోటు వద్ద చోటు చేసుకుంది. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురానికి చెందిన మునగాల బలరాం (40) ఫర్నిచర్ వస్తువులు కంతుల వారీగా ఇచ్చి వాటిని తిరిగి వసూలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దోర్నాల నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో గురువారం వస్తున్నారు. కర్నూలు నుంచి కనిగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు తాటిచెర్ల వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బలరాం అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గిద్దలూరు సీఐ ఫిరోజ్, కొమరోలు ఎస్సై సుబ్బరాజులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM