శత మర్కటం... ప్రాణ సంకటం
కోతుల దాడులతో ప్రజలు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి దూరి వస్తువులు ఎత్తుకెళ్లడం, ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేయడంతో ఇప్పటికే పలువురు ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
- ఈనాడు, ఒంగోలు, పీసీపల్లి, న్యూస్టుడే: కోతుల దాడులతో ప్రజలు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి దూరి వస్తువులు ఎత్తుకెళ్లడం, ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేయడంతో ఇప్పటికే పలువురు ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటికి భయపడి పరుగులు తీసిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్సలు సైతం చేయించుకున్నారు. ఇవే కాకుండా పంటలను ధ్వంసం చేస్తున్నాయి. వాటి బెడద తట్టుకోలేక కొందరు రైతులు పంటలు సాగు చేయడమే మానుకున్నారు. పీసీపల్లి మండలంలోని మురుగమ్మి, పీసీపల్లి, చింతగుంపల్లి, గుంటుపల్లి, లక్ష్మక్కపల్లి, మారెళ్ల పంచాయతీలోని సుమారు 20కి పైగా గ్రామాల్లో అధికంగా కోతులున్నాయి. ఆ ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన బత్తాయి, మామిడి, వరి, దానిమ్మ, మిరప, పత్తి, కూరగాయలు, మినుము ఇలా చాలా రకాల పంటలను పాడు చేస్తున్నాయి.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు...: * పీసీపల్లి మండలంలోని మురుగమ్మిలో రెండు రోజుల కిత్రం ఆరుబయట మంచంపై ఉన్న మూడు నెలల చిన్నారిని ఓ కోతి ఎత్తుకెళ్లే క్రమంలో ఇనుప సామగ్రిపై జారవిడిచింది. బిడ్డ ప్రాణాలు కోల్పోయింది.
* ఈ ఏడాది నవంబర్లో హనుమంతునిపాడు మండలం మూరవారిపల్లిలో ఉడుముల తిరుపతమ్మ అనే మహిళ డాబాపై పూలు కోసేందుకు వెళ్లారు. ఆ సమయంలో కోతుల గుంపు ఒక్కసారిగా ఆమె మీదకు ఎగబడటంతో భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో మెట్ల పైనుంచి జారిపడటంతో వెన్నుముక దెబ్బతిని మంచానికే పరిమితమయ్యారు.
* మార్కాపురంలో సుమారు ఆరు నెలల క్రితం ఓ బేల్దారీ మేస్త్రీ కూలి పని కోసం వచ్చి మూడంస్తులపైన పని చేస్తున్నారు. అక్కడికి కోతులు రావడంతో భయంతో పక్కకు వెళ్లేందుకు ప్రయత్నించి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలో జిల్లా వ్యాప్తంగా మరికొన్ని చోటుచేసుకున్నాయి.
భయం..భయం
యర్రగొండపాలెం కొలుకుల రోడ్డులోని వీధిలో నిత్యం పది వానరాలు అటువైపుగా వచ్చే వాహనదారులు, పాదచారులపై దాడి చేస్తున్నాయి. ఓ వృద్ధుడు నడిచి వస్తుండగా అతడి కాలిని ఓ వానరం చుట్టి గాయపరిచింది. ఈ పరిణామానికి భయపడ్డ ఆయన కాలిని గట్టిగా వెనక్కు తీసుకుని వేగంగా ముందుకు వెళ్లిపోయారు.
ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి...
మా మండలంలో అనేక గ్రామాల్లో కోతులు సంచారం ఎక్కువగా ఉంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై అధికంగా దాడులు చేస్తున్నాయి. పంటలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కోసారి ఇళ్లలోకి చొరబడి వస్తువులు ఎత్తుకుపోతున్నాయి.
- కాలం రమణయ్య, పెదఇర్లపాడు, పీసీపల్లి మండలం
పనులు మానుకొని కాపలా కాస్తున్నాం
కోతుల బెడదతో నానా అవస్థలు పడుతున్నాం. మా ఊరిలోనే నలుగురు కోతులు కరవడంతో గాయపడ్డారు. వీధుల్లోకి రావాలంటే భయమేస్తోంది. పనులు మానుకుని ఇళ్ల వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. వాటి బెడద తీర్చేందుకు అధికారులు చొరవ చూపాలి.
- బండారు వెంకట నర్సయ్య, మారెళ్ల, పీసీపల్లి మండలం
గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటాం
మండలంలోని పలు గ్రామాల్లో వానరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయని తెలిసింది. పంచాయతీ అధికారులను ఆదేశాలిచ్చి వాటిని తరిమేందుకు చర్యలు తీసుకుంటాం. కోతుల దాడుల్లో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చూస్తాం.
- రమణారెడ్డి, ఇన్ఛార్జి ఎంపీడీవో పీసీపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
[ 20-04-2024]
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు. -
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
[ 20-04-2024]
ఎన్నికల కోడ్కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది. -
కిరాయికి కేటుగాళ్లు
[ 20-04-2024]
ఒకప్పుడు జిల్లాలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు వాళ్లు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు. ఇటువంటి వారితో అధికార పార్టీ కొత్త కుట్రలకు తెర లేపింది. -
అడవిలో ఇళ్లిచ్చిన అన్న
[ 20-04-2024]
నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు. -
రాజుకున్న ఎన్నికల వేడి
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. -
రగడ.. ఇదేం మర్యాద
[ 20-04-2024]
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. -
వైభవం.. రాములోరి రథోత్సవం
[ 20-04-2024]
శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. -
ఒట్టు పెడుతున్నాం.. ఓటు వినియోగించుకుంటాం
[ 20-04-2024]
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. -
నగదు చోరీలో ఇంటి దొంగలు
[ 20-04-2024]
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. -
నామినేషన్ల వేళ.. తీరుమారని వైకాపా
[ 20-04-2024]
గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
‘సొంత చెల్లినే గెంటేసిన వ్యక్తి జగన్’
[ 20-04-2024]
కష్టకాలంలో తనను ఆదుకున్న సొంత చెల్లినే బయటకు గెంటేసిన వ్యక్తి సీఎం జగన్ అని తెదేపా జోన్-4 పరిశీలకుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి వివరించారు. -
నామపత్ర సంబరం
[ 20-04-2024]
నామపత్రాల సమర్పణకు శుక్రవారం సుమూహూర్తం కావడంతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. -
కోలాహలంగా ఎరిక్షన్బాబు నామినేషన్
[ 20-04-2024]
యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు శుక్రవారం నామినేషన్ వేశారు. -
వీధిన పడ్డ బతుకులు
[ 20-04-2024]
ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. -
తెదేపాలో చేరికల ఉత్సాహం
[ 20-04-2024]
దర్శి తెదేపాలో చేరికల జోరు కొనసాగుతోంది. పలువురు నాయకులు, కార్యకర్తలు అధికార వైకాపాను వీడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM