logo

ఒక్క రోజు వ్యవధిలో తండ్రీ కుమారుల మృతి

ఒక్క రోజు వ్యవధిలో తండ్రీ కుమారులు మృతి చెందడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కంభం మండలం ఔరంగాబాద్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.

Published : 03 Dec 2022 05:04 IST

ఔరంగాబాద్‌లో విషాదం

కంభం, న్యూస్‌టుడే: ఒక్క రోజు వ్యవధిలో తండ్రీ కుమారులు మృతి చెందడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కంభం మండలం ఔరంగాబాద్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జక్కం వెంకటనారాయణరెడ్డి (43)... గత నెల 30 (బుధవారం)న నడింపల్లి వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి శేషిరెడ్డి (75)... కుమారుడి మృతి విషయం తెలిసి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం ఉదయం కంభం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. అనంతరం... కుమారుడి అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ, మరోసారి ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో మళ్లీ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈయనకు భార్య కాశమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 24 గంటల వ్యవధిలో తండ్రీ కుమారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని