అగ్రిటెక్ ప్రదర్శనకు జిల్లా రైతులు
వ్యవసాయంలో మెలకువలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు.
జెండా ఊపి రైతుల బస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్ దినేష్కుమార్
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: వ్యవసాయంలో మెలకువలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. ఆ మేరకు గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న అగ్రిటెక్ ప్రదర్శనకు... జిల్లా నుంచి రైతులతో వెళ్తున్న బస్సును జెండా ఊపి శనివారం ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలపై వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మూడు రోజుల అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. జిల్లా నుంచి ఈ మూడు రోజుల్లో 600 మంది రైతులను సదస్సుకు పంపేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఏడీఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ
-
Crime News
Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్ హీటర్ తగిలి తండ్రి, కుమార్తె మృతి