బాత్రూంలో జారిపడి హెడ్కానిస్టేబుల్ మృతి
ప్రమాదవశాత్తు బాత్రూంలో జారి పడి తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు.
హైదరాబాద్, న్యూస్టుడే: ప్రమాదవశాత్తు బాత్రూంలో జారి పడి తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు. జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణ(40) హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట ఠాణాలో హెడ్కానిస్టేబుల్గా రెండేళ్లుగా పనిచేస్తున్నారు. స్థానిక విజయనగర్ కాలనీలో నివాసముంటున్నారు. గురువారం అర్ధరాత్రి 1.30కు ఇంట్లో బాత్రూంకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి కిందపడ్డారు. తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు కూకట్పల్లిలోని రాందేవ్రావు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. శ్రీమన్నారాయణకు భార్య ధనలక్ష్మి, కుమార్తెలు రోహిత, హర్షిణి ఉన్నారు. రోహిణి బీటెక్ చదువుతుండగా, హర్షిణి ఇంటర్ చదువుతోంది. 20 ఏళ్లుగా బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఆయన మరణంతో ఠాణాలో విషాదఛాయలు అలముకున్నాయి. రాందేవ్రావు ఆసుపత్రిలో మృతదేహానికి పోలీసు ఉన్నతాధికారులు, జగద్గిరిగుట్ట పరిధిలోని వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు.
22 చోరీల కేసులో నిందితుడి అరెస్టు
దుగ్గిరాల, న్యూస్టుడే: గుంటూరు జిల్లాలోని ఈమనిలో జరిగిన చోరీ కేసులో నిందితుడు అర్థవీడు మండలం మాగుటూరు గ్రామానికి చెందిన నల్లబోతుల లక్ష్మయ్యను గురువారంఅరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతేడాది మే 14న ఈమనిలోని చుక్కా మల్లికాంబ ఇంట్లో బంగారం, వెండి, నగదు అపహరించినట్లు చెప్పారు. ఆ సొత్తును మొత్తం స్వాధీనం చేసుకున్నామన్నారు. గుంటూరు, కృష్ణా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కలిసి అతను మరో 22 చోరీలు చేసినట్లు అంగీకరించాడని వివరించారు. ఎస్పీ ఆరిఫ్హపీÆజ్ ఉత్తర్వుల మేరకు గుంటూరు సీసీఎస్, మంగళగిరి డీఎస్పీ రాంబాబు, సీఐ భూషణం పర్యవేక్షణలో కేసును ఛేదించామన్నారు. నిందితుడిని శుక్రవారం తెనాలిలోని న్యాయస్థానంలో హాజరుపర్చగా రిమాండ్కు పంపినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు