సందడిగా దామచర్ల జన్మదిన వేడుకలు
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెదేపా శ్రేణులు
తోపుడు బండి అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. చిత్రంలో నాయకులు, తెలుగు మహిళలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత నాయకులు, కార్యకర్తల మధ్య కేకు కోశారు. ఒంగోలు, కొండపి నియోజకవర్గాలతో పాటు, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి తెదేపా శ్రేణులు, ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. డీజేఆర్ ట్రస్టు తరఫున పది మంది పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బీఎన్.విజయకుమార్, పాలపర్తి డేవిడ్రాజు, నారపుశెట్టి పాపారావు, దివి శివరాం, తెదేపా కందుకూరు నియోజకవర్గ బాధ్యుడు ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం, నాయకులు పమిడి రమేష్, మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, వైవీ.సుబ్బారావు తదితరులు జనార్దన్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత టంగుటూరు మండలంంలోని వల్లూరమ్మ, అంగాల పరమేశ్వరమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. టంగుటూరులోని నివాసంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనూ కేకు కోశారు. ఒంగోలు బీకే అపార్ట్మెంట్లో నిర్వహించిన వేడుకల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యులు దామచర్లకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుమల ఆశోక్రెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, యర్రగొండపాలెం, చీరాల పార్టీ బాధ్యులు గూడూరి ఎరిక్షన్బాబు, ఎం.ఎం.కొండయ్య, తెలుగు మహిళా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ, కార్యదర్శి మండుల లావణ్య, నాయకులు పుల్లంశెట్టి మణి, దివి రోశయ్య, గుమ్మడి సాయిబాబు, వలివర్తి శేషంరాజు, పి.అనిల్కుమార్, సురేష్బాబు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, శ్రీకాంత్బాబు తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్
[ 28-03-2024]
పశ్చిమంలోని కీలకమైన పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు. -
కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి
[ 28-03-2024]
టంగుటూరు టోల్ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
తలుపు తట్టనున్న ఓటు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది. -
రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం స్వాధీనం
[ 28-03-2024]
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లుగా అనుమానించిన సుమారు రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
దర్శి బరిలో నిలిచేదెవరు!
[ 28-03-2024]
జిల్లా రాజకీయాలను ఉత్కంఠతో ఊపేస్తున్న నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి తెదేపా కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. -
త్వరలో మూడు చోట్ల జనసేన సభలు, రోడ్షోలు
[ 28-03-2024]
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్కల్యాణ్ను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
కీలుబొమ్మల స్వామిభక్తి
[ 28-03-2024]
ప్రజాధనాన్ని తాము వేతనంగా పొందుతున్నామనే విషయాన్ని పలువురు వాలంటీర్లు విస్మరిస్తున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తల అవతారమెత్తారు. -
ఎన్నికల వేళ.. ఎన్ని విచిత్రాలో అన్నా
[ 28-03-2024]
అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది. -
ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటు చేసినా.. వారు గడిన పడటం లేదు. -
భారీగా అక్రమ మద్యం స్వాధీనం
[ 28-03-2024]
అర్థవీడు మండలం పోతురాజుటూరు- యాచవరం గ్రామాల నడుమ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసినట్లు మార్కాపురం సెబ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆక్వాలో ఉపాధికి అపార అవకాశం
[ 28-03-2024]
ఆక్వారంగం నేడు ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకుంటోందని, ఇందులో ఉపాధికి అపార అవకాశాలున్నాయని ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి అన్నారు. -
విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలకు దేహశుద్ధి
[ 28-03-2024]
పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా, బాలికల బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఒంగోలు ఆర్వోపై కలెక్టర్ ఆగ్రహం
[ 28-03-2024]
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జీవీ.సుబ్బారెడ్డిపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమనీయం.. ప్రతిష్ఠా మహోత్సవం
[ 28-03-2024]
శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సంతనూతలపాడులో బుధవారం కనులపండువగా నిర్వహించారు. -
ముగిసిన పదో తరగతి ప్రధాన పరీక్షలు
[ 28-03-2024]
పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సంస్కృతం, వృత్తి విద్యకు సంబంధించినవి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి. -
జీజీహెచ్లో రోగుల భోజనంపై విచారణ
[ 28-03-2024]
సర్వజన ఆసుపత్రిలో రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై వైద్య విద్య డైరెక్టరేట్ విభాగం అధికారులు స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా