logo

నగదు వ్యవహారంలో నాయకుల మధ్య గొడవ

వ్యక్తిగత నగదు లావాదేవీల వ్యవహారంలో ఇద్దరు వైకాపా నాయకుల మధ్య గొడవ చోటుచేసుకున్న సంఘటన మార్కాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం చోటుచేసుకుంది.

Published : 22 Jan 2023 02:01 IST

మార్కాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఘటన

ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి క్యాంపు కార్యాలయంలో గొడవ పడుతున్న వైకాపా నాయకులు చెంచిరెడ్డి, శ్రీనివాసులు

మార్కాపురం: వ్యక్తిగత నగదు లావాదేవీల వ్యవహారంలో ఇద్దరు వైకాపా నాయకుల మధ్య గొడవ చోటుచేసుకున్న సంఘటన మార్కాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌-2 అంజమ్మ భర్త శ్రీనివాసులకు అవసరాల నిమిత్తం మార్కాపురం ఎంపీపీ పోరెడ్డి అరుణ భర్త చెంచిరెడ్డి గతంలో నగదు ఇచ్చినట్లు సమాచారం. ఈ నగదు వ్యవహారంలో తరచూ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శనివారం ఇద్దరూ ఎదురు పడటంతో గట్టిగా అరుచుకుంటూ గొడవ పడ్డారు. ఇతర నాయకులు వీరికి సర్దిచెప్పారు. ఈ వ్యవహారం మొత్తం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తన కార్యాలయం లోపల ఉండగానే చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని