యువగళానికి జిల్లా నేతలు
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు ఉమ్మడి ప్రకాశం తెదేపా నేతలు తరలివెళ్లారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను
కలిసినమాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు ఉమ్మడి ప్రకాశం తెదేపా నేతలు తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్.. అద్దంకి, పర్చూరు, కొండపి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, బీఎన్ విజయకుమార్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు తిరుపతి వెళ్లారు. తిరుమలలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని.. ఆ తర్వాత కుప్పం బయలుదేరనున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేశ్ను దామచర్ల జనార్దన్ కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
వై.పాలెం నేతలకు అధిష్ఠానం పిలుపు
యర్రగొండపాలెం నియోజకవర్గం తెదేపా బాధ్యుడు గూడూరి ఎరిక్షన్బాబు, పార్టీ నాయకులు మన్నే రవీంద్రకు తెదేపా అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. వారిద్దరితో గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల ఆ నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమన్వయం చేసేలా భేటీకి ఆహ్వానించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల