logo

యువగళానికి జిల్లా నేతలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పేరుతో చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు ఉమ్మడి ప్రకాశం తెదేపా నేతలు తరలివెళ్లారు.

Published : 26 Jan 2023 02:56 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను
కలిసినమాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పేరుతో చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు ఉమ్మడి ప్రకాశం తెదేపా నేతలు తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌.. అద్దంకి, పర్చూరు, కొండపి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, బీఎన్‌ విజయకుమార్‌, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు తిరుపతి వెళ్లారు. తిరుమలలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని.. ఆ తర్వాత కుప్పం బయలుదేరనున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లోకేశ్‌ను దామచర్ల జనార్దన్‌ కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

వై.పాలెం నేతలకు అధిష్ఠానం పిలుపు

యర్రగొండపాలెం నియోజకవర్గం తెదేపా బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు, పార్టీ నాయకులు మన్నే రవీంద్రకు తెదేపా అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. వారిద్దరితో గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల ఆ నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమన్వయం చేసేలా భేటీకి ఆహ్వానించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని