కానరాని పేర్లు.. వేదనలో నిర్వాసితులు
జిల్లాలోనే కీలకమైన ప్రాజెక్టు వెలిగొండ. ఇది పూర్తయితే పశ్చిమ ప్రకాశంలో తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయి.
వెలిగొండ ముంపు గ్రామాల్లో పరిస్థితి
న్యాయం చేయాలంటూ దరఖాస్తుల వెల్లువ
మార్కాపురం గ్రామీణం, న్యూస్టుడే
మార్కాపురం మండలం గొట్టిపడియ నిర్వాసిత గ్రామం
జిల్లాలోనే కీలకమైన ప్రాజెక్టు వెలిగొండ. ఇది పూర్తయితే పశ్చిమ ప్రకాశంలో తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయి. ఇంతటి కీలకమైన ప్రాజెక్టు కోసం పుట్టి పెరిగిన గ్రామాలను, వ్యవసాయ భూములను త్యాగం చేసిన నిర్వాసితుల పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. పునరావాసం కల్పన, పరిహారం దక్కక ఇప్పటికీ ముంపు గ్రామాల్లోనే వీరు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వాసితుల పేర్లతో నూతన గెజిట్ జాబితాను ప్రకటించింది. అందులో అనేకమంది పేర్లు లేకపోవడంతో వారంతా తల్లడిల్లుతున్నారు. అధికారులు చెప్పిన ఆధారాలు అందజేసిన తర్వాత మళ్లీ ఏదో ఒకటి లేదంటూ మెలికలు పెడుతున్నారని వాపోతున్నారు. తమకు అర్హత కల్పించాలని, జాబితాలో పేర్లు చేర్చాలని దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు ముంపు గ్రామాల్లో అధికారుల బృందాలు పర్యటించి విచారణ చేపట్టాయి. ఇప్పటికైనా న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు.
కలనూతలలో దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు
1457 దరఖాస్తులు
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువుతండా.. పెద్దారవీడు మండలం సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల, కాటంరాజుతండా, చింతలముడిపి.. అర్థవీడు మండలం లక్ష్మీపురం, సాయిరాంనగర్, రామలింగేశ్వరపురం, కృష్ణనగర్ ఉన్నాయి. ఈ 11 గ్రామాల నుంచి 7319 మంది నిర్వాసితులు ఉన్నారంటూ అధికారులు గెజిట్ జాబితా ప్రకటించారు. ఇంకా అనేకమంది అర్హుల పేర్లు ఇందులో లేవని ఆ గ్రామాల నిర్వాసితులు వాపోతున్నారు. ప్రతి గ్రామంలో సగటున 40 నుంచి 200 మంది వరకు వీరు ఉన్నారు. గెజిట్లో తమను చేర్చాలంటూ 1457 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి.
మా కుటుంబ సభ్యుల పేర్లు లేవు
మా పూర్వీకుల నుంచి గొట్టిపడియలోనే ఉంటున్నాం. ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ జాబితాలో మా అమ్మ పేరు ఒక్కటే ఉంది. మా దంపతుల పేర్లు లేవు. అనేకమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. దళారులకు లంచాలు ఇచ్చే పరిస్థితి లేదు. అధికారులే న్యాయం చేయాలి.
సాలువ శ్రీనివాసులు, గొట్టిపడియ ముంపు గ్రామం
జాబితాలో చోటు కోసం పదేపదే దరఖాస్తులు
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామంలో ఉన్నా మా పేర్ల్లు లేవు. ఇక్కడే ఉన్నట్లు అన్ని ఆధారాలు అధికారులకు అందజేశాం. అనేకసార్లు పరిశీలన చేశారు.. విచారణ జరిపారు. అయినా నిర్వాసితుల జాబితాలో మాకు చోటు దక్కలేదు. కలెక్టర్, జేసీలకు సైతం వినతులు ఇచ్చాం.
పెరుమాళ్ల భాగ్యలక్ష్మి, గొట్టిపడియ
పూర్వీకుల నుంచి ఇక్కడే
మా తల్లి, అన్నదమ్ముల పేర్లు జాబితాలో ఉన్నాయి. నాతో పాటు నా కుమారులు, కుమార్తెల పేర్లు (అయిదుగురు) కానరాలేదు. అధికారులు మార్కాపురం మండలంలోని ఇడుపూరు సమీపంలో ఏర్పాటు చేసిన నిర్వాసితుల కాలనీలో ఇంటి పట్టాలు మంజూరు చేశారు. జాబితాలో నమోదు కోసం కొన్నేళ్లుగా తిరుగుతున్నా. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలి.
జి.మల్లికార్జున, కలనూతల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM