పులుల సంచారంతో అలజడి నల్లమల శివారు పల్లెలు అప్రమత్తం
నల్లమల సమీపంలోని గ్రామాల్లో పెద్ద పులుల సంచారం అలజడి రేపుతోంది. వెలగలపాయ, మాగుటూరు, పాపినేనిపల్లి, దోర్నాల, గిద్దలూరు అటవీ పరిధి గ్రామాల్లోకి ఆహారం, నీటి కోసం ఇవి వస్తున్నాయి.
అర్థవీడు, న్యూస్టుడే
ఆవు కళేబరం వద్దకు పులి రెండోసారి వస్తున్న దృశ్యం సీసీ కెమెరాలో చిక్కింది ఇలా..
2008 పులుల గణన ప్రకారం నల్లమలలో 60కి పైగా పెద్ద పులులు ఉండగా..ఒక్క మార్కాపురం డివిజన్ పరిధిలో 48 వరకు ఉన్నాయి.
నల్లమల సమీపంలోని గ్రామాల్లో పెద్ద పులుల సంచారం అలజడి రేపుతోంది. వెలగలపాయ, మాగుటూరు, పాపినేనిపల్లి, దోర్నాల, గిద్దలూరు అటవీ పరిధి గ్రామాల్లోకి ఆహారం, నీటి కోసం ఇవి వస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని పశువులు, జీవాలు వీటికి బలవుతున్నాయి. పులులను గుర్తించి అడవిలోకి తరమడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారు. క్షేత్రస్థాయి అధికారులు ప్రతి రోజు బీట్ పరిధిలో పెట్రోలింగ్ చేయకపోవడం, స్థానికంగా నివాసం ఉండకపోవడంతో పాటు ముఖ చిత్ర హాజరు వేసే నెపంతో మార్కాపురం రేంజ్ కార్యాలయానికి వెళ్లడం వంటి కారణంగా అందుబాటులో ఉండటం లేదు.
పదేళ్లలో అర్థవీడు మండల పరిధిలోని వెలగలపాయ, పాపినేనిపల్లి, మాగుటూరు సమీప గ్రామాల్లో సుమారు 10 వరకు ఎద్దులు..మరో 20 వరకు గేదెలు, ఆవులు పులుల దాడిలో మృత్యువాత పడ్డాయి. ఇటీవల మాగుటూరుకు చెందిన గురుస్వామికి చెందిన ఆవుపై శంఖరాపురం-లక్ష్మీపురం రహదారి సమీపంలో పెద్దపులి దాడి చేసి చంపింది. ఆవు కళేబరం వద్దకు దాడి చేసిన పులి రెండు సార్లు వచ్చి పోవడం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిక్కింది. అదే సమయంలో మాగుటూరు సమీప పొలాల్లో దుప్పిని వేటాడి..పొలాల గట్టునే తిని వెళ్తున్న ఘటన చూసి రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు రోజుల వ్యవధిలో వెలగలపాయ సమీపంలో మరో ఎద్దు పై దాడి చేసింది. గట్టిగా కేకలు వేయడంతో పారిపోయినట్లు రైతులు తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు అటవీ పరిధి గ్రామాలకు అందుబాటులో ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని రైతులు, పశు పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభయారణ్యానికి కూతవేటు దూరంలో ...
అర్థవీడు మండల పరిధిలోని లోయ, మండల కేంద్ర సమీప పల్లెలు అన్నీ నల్లమల అభయారణ్యానికి కూతవేటు దూరంలోనే ఉన్నాయి. బొల్లుపల్లి, వెలగలపాయ నుంచి నాగులవరం, కాకర్ల వరకు నల్లమల అడవి నుంచి ఎత్తైన కొండ ఒకటే ఉంది. కొండకు అటూ ఇటూ..లోయ.. మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న సుమారు 20 గ్రామాలు కొండల అంచునే ఉంటున్నాయి. పెద్ద పులులు, చిరుతలు వీటి సమీపంలోనే సంచరిస్తుంటాయి. ఇక్కడి ప్రజల జీవనాధారం పశుపోషణ కావడంతో వాటి మేతకు అడవి లోకే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పులుల దాడిలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అటవీ శాఖ నష్టపరిహారంగా నగదు ఇస్తున్నా పులుల సంచారంతో పశు పోషకులు, రైతులు అటు వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు.
పులి దాడిలో మృత్యువాత పడిన ఆవు
ప్రత్యేక నిఘా ఉంచాం..
ఏడాది వయసున్న పులులు తల్లి నుంచి వేరై ఎటైనా వెళ్తుంటాయి. అలా మాగుటూరు వైపు వచ్చిన పులి వేట కోసం వచ్చి ఉంటుంది. ఆవుపై దాడి చేసిన విషయం తెలుసుకుని క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశాం. ఆవు కళేబరం వద్ద కెమెరా ఏర్పాటు చేసి వాటి సంచారం తెలుసుకున్నాం. ఆహారం కోసం వేటాడే క్రమంలో అవి దారి తప్పడం సహజం. సమీప గ్రామాల్లో పశుపోషకులకు, రైతులకు వీటి సంచారంపై అవగాహన కల్పించాం.
ప్రసాద్రెడ్డి, డీఆర్వో, నాగులవరం సెక్షన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ