పేరు మార్చి.. పైసా ఇవ్వలేదు
‘జిల్లాకు మంజూరైన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు, తరగతులు ప్రారంభమవుతాయి...’ ఇవీ నాటి విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన.
ఈ ఏడాదీ విశ్వమిథ్యాలయమే
ఆచరణకు నోచని పాలకుల మాటలు
నగరంలోని నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ సెంటర్
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ‘జిల్లాకు మంజూరైన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు, తరగతులు ప్రారంభమవుతాయి...’ ఇవీ నాటి విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన. అధికారులు కూడా పీజీ ప్రవేశాలను కొత్త విశ్వవిద్యాలయం పేరుతోనే చేపట్టనున్నట్టు తెలిపారు. ఆచరణలో ఇవేమీ అమలు కాలేదు. టంగుటూరు ప్రకాశం విశ్వవిద్యాలయం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరును ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంగా మార్చారు. ఇన్ఛార్జి ఉప కులపతిగా ట్రిపుల్ఐటీ డైరెక్టర్ను నియమించారు. ఓఎస్డీ బాధ్యతలను పీజీ కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ ఆచార్యునికి అప్పగించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించిన ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకం, డిగ్రీ కళాశాలల విభజన, ఎన్యూ నుంచి ఆస్తుల పంపకం చేపట్టాల్సి ఉంది. ఈ పనుల్లో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు పూర్తికాలేదు.
నాగార్జున పేరుతోనే నిర్వహణ...: రాష్ట్ర బడ్జెట్లో విశ్వవిద్యాలయం భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తారని అంతా ఆశించారు. చివరికి నిరాశే మిగిలింది. బడ్జెటేతర పద్దు కింద నిర్వహణ అవసరాలకు నిధులు కేటాయిస్తామని, ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు కోరారు. ఈ మేరకు రూ.10 కోట్లు అవసరమని జిల్లా నుంచి నివేదిక పంపారు. గత ఏడాది సెప్టెంబర్లో నిధులు వస్తాయని ఎదురు చూసినప్పటికీ పైసా విడుదల కాలేదు. సిబ్బంది నియామకం, న్యాక్ గుర్తింపు వంటివేమీ లేకపోవడంతో ఈ ఏడాది కూడా నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారానే బోధన, సిబ్బందికి వేతనాలు, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
పాత కోర్సులతోనే ప్రవేశాలు సరి...: జిల్లాలో ఏర్పాటయ్యే విశ్వవిద్యాలయంలో కొత్తగా 8 కోర్సులు ప్రారంభించాలని తొలుత ప్రతిపాదించారు. చివరికి ఎన్యూ పీజీ కేంద్రంలో ఉన్న 11 పాత కోర్సుల్లోనే ఈ ఏడాదికి ప్రవేశాలు చేపట్టారు. ఆంధ్రకేసరి పేరుతో ప్రవేశాలు చేపట్టినప్పటికీ ఎన్యూ ఆధీనంలోనే కోర్సుల నిర్వహణ సాగుతోంది. విశ్వవిద్యాలయం వస్తుందా రాదా అనే డోలాయమాన పరిస్థితిలో విద్యార్థులు ఇక్కడ చేరడానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా 11 కోర్సుల్లో కలిపి అయిదు వందలకు పైగా సీట్లు ఉండగా కేవలం 111 మంది మాత్రమే చేరారు. ఎంబీఏలో 60 సీట్లుండగా 45 మంది ప్రవేశాలు పొందారు. ఎంపీఈడీలో వంద సీట్లకు గాను 22 మంది.. పీజీ చరిత్ర విభాగంలో అసలు ప్రవేశాలు లేవు. మిగిలిన వాటిలోనూ చేరిన వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించొచ్చు. ఇప్పటికైనా పాలకులు స్పందించి కొత్త విశ్వవిద్యాలయం ప్రారంభానికి అవసరమైన నిధుల కేటాయింపునకు కృషిచేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్