రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే ఊరుకోం...
విభజన హామీల అమలులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.కృష్ణయ్య విమర్శించారు.
ప్రదర్శనలో పాల్గొన్న వామపక్ష, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: విభజన హామీల అమలులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.కృష్ణయ్య విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ వామపక్ష, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం రాత్రి ఒంగోలు చేరుకుంది. మంగమూరు రోడ్డు కూడలి నుంచి సాయిబాబా గుడి వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కృష్ణయ్య మాట్లాడారు. పాలకులు తమ స్వలాభం, పదవుల కోసం రాష్ట్ర యువత ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని.. ఈ పద్ధతిని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అందుకే యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పించాలని సమరయాత్ర చేపట్టినట్టు తెలిపారు. సభలో పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎల్.రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జన్సాన్బాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, వామపక్ష నాయకులు కంకణాల ఆంజనేయులు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇట్లుంటది జగన్ తోని.. ఒంగోలు బ్రాండ్కే బ్యాండ్
[ 23-04-2024]
రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. -
జన బలం జాతర..
[ 23-04-2024]
జన బలానికి.. ప్రలోభాల పర్వానికి ఈ రెండు చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సోమవారం నామినేషన్ల దాఖలు సందడి నెలకొంది. -
అయిదేళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా!
[ 23-04-2024]
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన జగన్.. అయిదేళ్లలో ఉత్తుత్తి పనులు చేసి చివరిలో శిలాఫలకాలు వేశారు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా కనీసం మరమ్మతులు చేయించలేని జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు’... అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పడుతూ లేస్తూ పది ఫలితాలు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గత అయిదేళ్లుగా పడుతూ లేస్తూ వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 73.74 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రస్తుతం ఆ శాతం 91.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
89.97 శాతం ఉత్తీర్ణత
[ 23-04-2024]
2023-24 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి ఫలితాల్లో 89.97 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 60 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో మొత్తం 887 మంది విద్యార్థులుండగా, అందులో 798 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పసివారి పైనా పాలకుడి పడగ
[ 23-04-2024]
పసి వారిపైనా ముఖ్యమంత్రి జగన్ పగబట్టారు. ఆయన నిర్ణయంతో ఈ భావి సంపద నీరుగారిపోతోంది. ‘పది రూపాయలు’ మిగుల్చుకుందామని అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. -
తాగు.. తూలు.. జైకొట్టు
[ 23-04-2024]
‘బాబ్బాబూ.. నామినేషన్ వేస్తున్నాం. కాస్తంత అక్కడి వరకు వచ్చిపోండి. ఊరకనే కాదు అయిదొందల నోటు, క్వార్టర్ సీసా ఇస్తాం. పసందైన బిర్యానీ కూడా పెట్టిస్తాం. మందు తాగి మా పార్టీ జెండా పట్టుకుని జేజేలు కొడితే చాలు’ ఇదీ ప్రస్తుతం నామినేషన్ల సందర్భంగా వైకాపా అభ్యర్థుల ప్రదర్శనల్లో నాయకుల బతిమలాటలు. -
బాబ్బాబు.. రాజీనామా చేయరూ..!
[ 23-04-2024]
వైకాపా నేతలు తమ సైన్యం అనుకున్న వాలంటీర్లు ఇప్పుడు వారి మాట వినడం లేదు. రాజీనామా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని దొనకొండ మండల సచివాలయాల కన్వీనర్ గుంటు పోలయ్య తమ గ్రూపులో సోమవారం విజ్ఞప్తి చేశారు. -
నాలుగో రోజు 42 మంది నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నాలుగో రోజైన సోమవారం 42 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. -
చోరీ కేసు నిందితుడి విషాదాంతం
[ 23-04-2024]
చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఏరులై పారిన మద్యం
[ 23-04-2024]
మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు. -
జగనన్న కాలనీలా.. చిట్టడవులా!
[ 23-04-2024]
‘రాష్ట్రంలో ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నా’మంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న జగనన్న కాలనీలు చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ